Nagavamsi Viral Tweet: కరోనా లాక్ డౌన్ తర్వాత అత్యధిక సక్సెస్ రేట్ ఉన్న నిర్మాతల లిస్ట్ తీస్తే నాగవంశీ(Nagavamsi) తప్ప మరొకరు మనకి కనిపించరు. ఒకప్పుడు దిల్ రాజు(Dil Raju) అతి తక్కువ సమయం లో సూపర్ హిట్ సినిమాలతో ఎలా అయితే ఎదిగాడో, నాగవంశీ కూడా అంతే. కానీ ఇలాంటి నిర్మాతలు హిట్స్ వచ్చినప్పుడు తట్టుకోగలుతారు కానీ, ఫ్లాప్స్ వచ్చినప్పుడు మాత్రం అకస్మాత్తుగా మాయం అయిపోతారు. రీసెంట్ గా నాగవంశీ కి వరుసగా రెట్రో, కింగ్డమ్(Kingdom Movie) మరియు వార్ 2(War 2 Movie) లాంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి. ఈ మూడు సినిమాలకు కలిపి దాదాపుగా వంద కోట్ల రూపాయలకు పైగా నష్టాలు వచ్చాయి. దీంతో నాగవంశీ పని ఇక అవుట్, సినిమాల నుండి వెళ్ళిపోయాడు, ఆయన తదుపరి చిత్రం ‘మాస్ జాతర’ ని కూడా వాయిదా వేసి దుబాయి కి వెళ్ళిపోయాడు అంటూ రకరకాల కథనాలు వచ్చాయి.
Also Read: ‘వార్ 2’ కి వచ్చిన కలెక్షన్స్ లో మైనస్ షేర్స్..చరిత్రలో ఇదే తొలిసారి!
నాగవంశీ కూడా సైలెంట్ గా ఉండేలోపు నిజమేనేమో అని అనుకున్నారు చాలామంది. అయితే నేడు కాసేపటి క్రితమే ట్విట్టర్ లో ఒక ట్వీట్ వేస్తూ గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘ఏంటి అందరు నన్ను బాగా మిస్ అవుతున్నట్టు ఉన్నారు. వంశీ ఎక్కడికో వెళ్ళిపోయాడు, వంశీ ఆస్తులు అమ్ముకున్నాడు అంటూ నా పై చాలా హడావుడి నడుస్తుంది. పర్లేదు మన ట్విట్టర్ లో మంచి రైటర్స్ ఉన్నారట. మిమ్మల్ని నిరాశపరుస్తున్నందుకు నన్ను క్షమించండి, కానీ ఇంకా అంత సమయం రాలేదు, కనీసం 10 నుండి 15 ఏళ్ళు నేను ఇండస్ట్రీ లోనే ఉంటాను. సినిమా నే నా ప్రపంచం, సినిమా కోసమే ఉంటాను. నా తదుపరి చిత్రం ‘మాస్ జాతర’, త్వరలోనే కలుద్దాం’ అంటూ ఒక ట్వీట్ వేసాడు. ఇది బాగా వైరల్ అయ్యింది. ఇంత పెద్ద ఫ్లాప్ తగిలిన తర్వాత కూడా నాగవంశీ ఏమి మారలేదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ చెప్పుకొస్తున్నారు.
Also Read: ‘వార్ 2’ కి ముందు అనుకున్న స్టోరీ ఇదేనా? అలా తీసుంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యేది!
ఇదంతా పక్కన పెడితే ఒకప్పుడు నాగవంశీ ని గుడ్డిగా నమ్మి ఆయన వెంట నడిచిన బయ్యర్లు ఇప్పుడు ‘మాస్ జాతర’ చిత్రాన్ని కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. కారణం ‘కింగ్డమ్’ మరియు ‘వార్ 2’ మిగిలించిన నష్టాలే. దీంతో నాగవంశీ తన బయ్యర్స్ ని అందరిని హైదరాబాద్ కి పిలిపించి ‘మాస్ జాతర’ చిత్రాన్ని స్పెషల్ గా ప్రీమియర్ షో లాగా వేసి చూపించాడట. వాళ్ళ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఇంకా తెలియదు కానీ, వంశీ కి మాత్రం గట్టి ఎదురు డబ్బే తగిలింది అనుకోవచ్చు, ఇలాంటి పరిస్థితి ఆయనకు ఇప్పటి వరకు రాలేదు. రవితేజ హీరో గా నటించిన ఈ ‘మాస్ జాతర’ చిత్రం లో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. రీసెంట్ గా విడుదల చేసిన పాటలకు, టీజర్ కి ఆడియన్స్ నుండి డివైడ్ రెస్పాన్స్ వచ్చింది.
Enti nannu chala miss avthunattu unnaru..
Vamsi adi, Vamsi idi ani gripping narratives tho full hadavidi nadustundi…
Parledu, X lo manchi writers unnaru.Sorry to disappoint you all, but inka aa time raaledu… minimum inko 10-15 years undi.
At the cinemas… for the cinema,…
— Naga Vamsi (@vamsi84) August 20, 2025