కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో పలువురు సెలబ్రెటీలు తమవంతు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. తమకు తోచినట్లుగా పేదలకు సాయం అందిస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు. తాజాగా విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ తన మనస్సులోని మాటను బయటపెట్టారు. కరోనా ఎఫెక్ట్ తో పేదలు ఇబ్బందులు పడుతున్నారని తన శక్తిమేర సాయం అందిస్తానని చెప్పారు. అవసరమైతే అప్పు తెచ్చైనా సరే సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు.
వైద్యులకు అండగా నిలిచిన జనసేనాని
తన ఆర్థిక వనరులు క్షీణించినా సరే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానన్నారు. అవసరమైతే బ్యాంకులో రుణం తీసుకుంటానని.. కష్టకాలంలో పేదలకు అండగా ఉంటానని చెప్పారు. భవిష్యత్లో తాను సంపాదించుకోగలుగుతానని అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతీఒక్కరూ మానవత్వాన్ని చూపించాల్సిన బాధ్యత ఉందన్నారు. ‘మనమంతా కలిసి కరోనాపై పోరాడదాం.. జీవితాలను నిలబెడదాం’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. పేదలకు సహాయం చేస్తానని ఆయన చెప్పిన మాటలు ప్రతీఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. దీంతో ఆయన అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరు చెప్పినట్లుగానే తమవంతు పేదలకు సాయం చేస్తామంటూ కామెంట్లు చేస్తున్నారు.