Prabhas
Prabhas: బాహుబలి తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ ఆ తరువాత నుంచి బ్యాక్ టు బ్యాక్ ప్యాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే మన డార్లింగ్ టాలీవుడ్ ఫాన్స్ మాత్రం వింటేజ్ ప్రభాస్ ని చూసి చాలా రోజుల అయ్యింది అని తెగ ఫీల్ అయిపోతున్నారు.
ఎందుకు ముఖ్య కారణం ప్రభాస్ బాహుబలి తర్వాత నుంచి ఎక్కువగా బాలీవుడ్ వైపు దృష్టి మళ్లించడమే. అంతేకాకుండా బాలీవుడ్ దర్శకులు మన ప్రభాస్ ని అసలు సరిగ్గా చూపించలేరు అని ఈ మధ్య వచ్చిన ఆది పురుష్ సినిమా రుజువు చేసింది.
ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన డిజాస్టర్ చవిచూడదమే కాకుండా ప్రేక్షకుల దగ్గర నుంచి కూడా ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. రామాయణం ఆధారంగా చిత్రీకరించిన ఎపిక్ మూవీని… ఓం రౌత్ సరిగ్గా ప్రదర్శించ లేక పోయారని అందరూ నిరాశ పడ్డారు. ముఖ్యంగా ఈ సినిమాలో అసలు ప్రభాస్ గెటప్ బాగాలేదు అని ఎంతో మంది నొచ్చుకున్నారు.
ఇక బాహుబలి తరువాత ప్రభాస్ నుండి ఇప్పటి వరకు ఆశ నెరవేర్చే సినిమా రాలేదు. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్, వంటి సినిమాలు అన్నీ డిజాస్టర్ లగానే నిలిచాయి. సాహో సినిమా పరవాలేదు అనిపించినా ఆ తరువాత వచ్చిన రాధే శ్యామ్ అలానే ఆది పురుష్ మాత్రం తీవ్ర నిరాశకు గురి చేశాయి. ఇలాంటి నేపథ్యంలో ఆదిపురుష్ ఫెయిల్యూర్ తో మళ్లీ బాలీవుడ్ వైపు కొంత కాలం కన్నెత్తి చూడకూడదు అని ప్రభాస్ నిర్ణయించుకున్నారట. ఈ మేరకు బాలీవుడ్ దర్శకుల కథలను రిజెక్ట్ చేస్తున్నారట. అంతే కాదు ఇప్పటికే ఒప్పుకున్న సిద్దార్థ ఆనంద్ సినిమాని రిజెక్ట్ చేసేశాడని కూడా తెలుస్తోంది.
సిద్దార్థ ఆనంద్ ప్రభాస్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో భారీ మల్టీ స్టారర్ మూవీ ప్లాన్ చేసుకున్నట్లు ఎన్నో రోజులగా పుకార్లు షికార్లు కోడుతున్నాయి. దీంతో ఇరు హీరోల అభిమానుల అంచనాలకు హద్దులు లేకుండా పోయాయి. సిద్దార్థ ఆనంద్ వార్, పఠాన్, వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీశాడు. అందుకే ఇప్పుడు ప్రభాస్, హృతిక్ రోషన్ కలయికతో ఈ దర్శకుడు తీస్తున్న సినిమా తప్పకుండా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తిరుగులేని హిట్ అందుకుంటుందని భావించాడు. కానీ ఈ సినిమాని కూడా ప్రభాస్ తిరస్కరించాడంట.
ఒకపక్క బాలీవుడ్ దర్శకుల సినిమాలు చేయకూడదు అనే నిర్ణయం తీసుకున్నందుకు ప్రభాస్ టాలీవుడ్ అభిమానులు సంతోషంగా ఉన్న, మరోపక్క సిద్ధార్థ ఆనంద్ సినిమా వదులుకున్న దానికి మాత్రం కొంతమంది అభిమానులు బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
ఇక ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నిల్ సలార్, నాగ అశ్విన్ కల్కి 2898 ఏ డీ, అలానే మారుతీ దర్శకత్వంలో వస్తోన్న రాజా డీలక్స్ సినిమాలతో బిజీగా ఉన్నారు.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Prabhas took a key decision about bollywood movies a big shock for everyone
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com