Radhe Shyam: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే నటించిన మూవీ ‘రాధేశ్యామ్’. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి … రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడిక్ లవ్ స్టోరీ నేపధ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని చెప్పాలి. అయితే ఇప్పుడు తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది.
రాధే శ్యామ్ మూవీకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ రైట్స్… రికార్డు స్థాయిలో అమ్ముడైనట్టు తెలుస్తోంది. ఆర్డి ఇల్యూమినేషన్ ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ను భారీ ధరకు సొంతం చేసుకుందని అనుకుంటున్నారు. కరోనా తరువాత అత్యంత భారీ ధరకు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అమ్ముడైన మూవీగా “రాధేశ్యామ్” అని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.
ఇక దీపావళి పండుగ కానుకగా ఈ సినిమాకు సంబంధించి మరో టీజర్ను విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు తెల్సుస్తుంది. కాగా ఈ టీజర్ హీరోయిన్ పూజా హెగ్డేకు సంబంధించిన వీడియో అని గుసగుసలు వినిపిస్తున్నాయి. యూవీ క్రియేషన్ బ్యానర్పై వంశీ – ప్రమోద్ – ప్రసీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ తో పాటు… ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్ ” లో కూడా నటిస్తున్నాడు. అలానే ఓం రావత్ డైరెక్షన్లో రూపొందుతోన్న ‘ఆదిపురుష్’ షూటింగ్లో కూడా పాల్గొంటున్నాడు. దీని తర్వాత నాగ్ అశ్విన్ ” ప్రాజెక్టు కె “, సందీప్ రెడ్డి వంగా ” స్పిరిట్ ” చిత్రాల్లో ప్రభాస్ నటించనున్నాడు.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Prabhas radhe shyam movie distribution rights sold for high price
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com