Varudu Kavalenu: విలక్షణమైన కథలు ఎంచుకుంటూ టాలీవుడ్ లో తనకంటూ సక్సెస్ రేటును కలిగి ఉన్న యంగ్ డైనమిక్ హీరో నాగశౌర్య. ప్రేక్షకులను అలరించడంలో హీరో నాగశౌర్య ఎప్పుడూ ముందుంటారు. ఈ హీరో సినిమా మినిమం గ్యారెంటీ అన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది. సినిమాలో ఖచ్చితంగా విషయం ఉండి.. ప్రేక్షకులను మెప్పించే హీరో ఇతడు. గత ఏడాది నటించిన ‘అశ్వథ్థామ’ మూవీ తర్వాత తాజాగా ‘వరుడు కావలెను’ సినిమాను నాగశౌర్య పూర్తి చేశాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ లు, ఫస్ట్ లుక్ ఆకట్టుకున్నాయి.
నాగశౌర్య, రీతు వర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మూవీ ‘వరుడు కావలెను’. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో రూపొందించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా పూర్తై చాలా కాలమే అయినప్పటికీ కరోనా కల్లోలం.. థియేటర్లు తెరవకపోవడంతో విడుదల కాలేదు. తాజాగా నిబంధనలు సడలించడం.. థియేటర్లకు జనం రాక మొదలు కావడంతో ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన లవ్ స్టోరీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్, పెళ్లిసందడి సినిమాలకు వస్తున్న ఆదరణతో ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. అక్టోబర్ 29న ‘వరుడు కావలెను’ మూవీని రిలీజ్ చేయాలని నిర్ణయించారు.
నిజానికి దసరాకే ఈ సినిమాను విడుదల చేయాలని చూసినా ఆ బరిలో ‘పెళ్లి సందడి’, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీలు నిలిచాయి. దీంతో ఈ నెలాఖరులో సినిమా విడుదల తేదీని ప్రకటించారు.
సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రానికి లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించారు. తమన్, విశాల్ చంద్రశేఖర్ సంయుక్తంగా సంగీతం అందించారు.