Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్ లో నంబర్ 1 స్థానానికి ఎదిగిన హీరో. ఎందరికో స్ఫూర్తిని పంచిన హీరో.. తన కెరీర్ మొదటి నుంచి ఇప్పటిదాకా స్వయంకృషితో ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు. ఆయన చేసిన ఎన్నో కళాత్మక చిత్రాలకు అవార్డులు సొంతమయ్యాయి. చిరంజీవిని వరించని అవార్డ్ లేదు. ఇప్పుడు తాజాగా ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. చిరంజీవికి అరుదైన గౌరవం లభించింది.

టాలీవుడ్ మెగాస్టర్ చిరంజీవి కీర్తికిరీటంలో మరో ప్రతిష్టాత్మక అవార్డ్ చేరింది. చిరంజీవిని ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ -2022’ అవార్డ్ వరించింది.
53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) చలనచిత్రోత్సవం నేడు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది.
చిరంజీవి తన 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 150కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయనకు ఈ అవార్డ్ ఇవ్వడంపై కేంద్ర ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో హర్షం వ్యక్తం చేసింది. గోవా వేదికగా ఇఫీ చలనచిత్రోత్సవం నేటి నుంచి ఈనెల 25 వరకూ జరగనుంది.
Indian Film Personality of the Year 2022 award goes to 𝐌𝐞𝐠𝐚𝐬𝐭𝐚𝐫 𝐂𝐡𝐢𝐫𝐚𝐧𝐣𝐞𝐞𝐯𝐢
With an illustrious career spanning almost four decades, he has been a part of more than 150 feature films
📽️https://t.co/1lSx81bGMw#IFFI #AnythingForFilms #IFFI53 @KChiruTweets pic.twitter.com/AY6UzMhfix
— PIB India (@PIB_India) November 20, 2022
[…] […]