తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదకరమైన సంఘటన చోటు చేసుకోవడం అందర్నీ కలిచివేస్తోంది. నిన్న రాత్రి ప్రముఖ పిఆర్ఓ మరియు నిర్మాత బి.ఏ రాజు ఆకస్మిక మరణం తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు. ఆయనకు ఉన్నట్టు ఉండి సడెన్ గా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్ కి తీసుకువెళ్లే లోపే ఆయన మరణించడం దురదృష్టకరం.
తెలుగు చిత్రసీమలోని ప్రముఖులంతా ఆయన మరణం పట్ల తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ తన నివాళులు అర్పిస్తూ బి.ఏ రాజుతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ వార్త తనని షాక్ కు గురి చేసిందని, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ గా మరియు పిఆర్ఓ గా ఆయన సినిమా ఇండస్ట్రీకి చాలా చేసారని, అదే విధంగా తన కెరీర్ ఆరంభం రోజుల నుంచే ఆయన తనకు తెలుసు అని ఎన్టీఆర్ ఎమోషనల్ అవుతూ ట్వీట్ చేశారు.
అలాంటి వ్యక్తి ఇపుడు లేకపోవడం మనకు అతి పెద్ద లోటు అని, వారి కుటుంబం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఎన్టీఆర్ ఆకాంక్షించారు. గత కొద్ది రోజులుగా బి.ఏ రాజు గుండెకు సంబంధించిన చికిత్స తీసుకుంటున్నారు, కానీ సడెన్ గా ఇలా ఉన్నట్టు ఉండి ప్రాణాలను కోల్పోవడం బాధాకరమైన విషయం.
ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో తెలుగు సినీ పరిశ్రమకు వరుస షాకులు మీద షాక్ లు తగులుతున్నాయి. మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున బి.ఏ రాజుగారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.
https://twitter.com/tarak9999/status/1395920889833680897?s=20