spot_img
Homeఎంటర్టైన్మెంట్Krishnam Raju Daughters: కృష్ణంరాజుకు ముగ్గురు కాదు నలుగురు కూతుళ్లు... ఆమెను దత్తత తీసుకోవడం వెనుక...

Krishnam Raju Daughters: కృష్ణంరాజుకు ముగ్గురు కాదు నలుగురు కూతుళ్లు… ఆమెను దత్తత తీసుకోవడం వెనుక గుండెలు పిండేసే నిజం!

Krishnam Raju Daughters: నటుడు కృష్ణంరాజు మరణం పరిశ్రమను విషాదంలో నింపింది. ఆయన మరణాన్ని తీర్చలేని లోతుగా ప్రముఖులు అభివర్ణిస్తున్నారు. కృష్ణంరాజు మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. రెండవ తరం సూపర్ స్టార్ అయిన కృష్ణంరాజు మరణం తర్వాత ఆయన జీవితానికి సంబంధించిన అనేక విషయాలు చర్చకు వస్తున్నాయి. కృష్ణంరాజుకు ముగ్గురు కూతుళ్లు కాగా వారు పుట్టక ముందే ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నారు. కృష్ణంరాజు మొదట వరసకు మరదలైన సీత అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. దురదృష్టవశాత్తు ఆమె రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు.

Krishnam Raju Daughters
Krishnam Raju Daughters

సీత మరణం కృష్ణంరాజును తీవ్ర మానసిక వేదనకు గురి చేసింది. కొన్నాళ్ళు ఆయన డిప్రెషన్ అనుభవించారు. ఇకపై జీవితంలో వివాహం చేసుకోకూడదు అనుకున్నాడు. ఆ కారణంతోనే ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆ అమ్మాయి పేరు ప్రశాంతి. అయితే కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో తప్పక 1996లో శ్యామలా దేవిని రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికి ప్రసీద, ప్రకీర్తి, ప్రదీప్తి అనే ముగ్గురు అమ్మాయిలు పుట్టారు. దత్త పుత్రిక అయినా… ప్రశాంతి అంటే కృష్ణంరాజుకు ప్రాణం.

మంచి సంబంధం చూసి ప్రశాంతి వివాహం ఘనంగా చేశాడు.ప్రస్తుతం ఆమె హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనుభవిస్తున్నారు. మొదటి భార్య చనిపోయిన బాధలో ప్రశాంతిని ఆయన దత్త తీసుకోవడం జరిగింది. అయితే కడుపున పుట్టిన కూతుళ్ళకు మాత్రం ఆయన వివాహం చేయలేదు. ఇప్పుడు వారి బాధ్యత ప్రభాస్ పై పడింది. పెదనాన్న పిల్లల ఆలనా పాలనా ప్రభాస్ చూసుకోవాలి. కృష్ణంరాజు దత్తత తీసుకున్న ప్రశాంతి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. కృష్ణంరాజుకు ముగ్గురు కుమార్తెలు మాత్రమే అనుకుంటారు.

Krishnam Raju Daughters
Krishnam Raju Daughters

నటుడిగా, మాజీ మంత్రిగా దశాబ్దాల పాటు కృష్ణంరాజు సేవలు అందించారు. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న కృష్ణంరాజు ఆరోగ్యం విషమించడంతో సెప్టెంబర్ 10 రాత్రి ఆస్పత్రిలో చేర్చారు. ఆయనకు వైద్యులు వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అంతర్గత అవయవాలు పని చేయకపోవడంతో ఆయన సెప్టెంబర్ 11 తెల్లవారుజామున కన్నుమూశారు. ఇక కృష్ణంరాజు అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖులు కృష్ణంరాజు పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైస్ జగన్ ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
NTR

NTR: కీలక నిర్ణయం దిశగా జూనియర్ ఎన్టీఆర్!

NTR: తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాతే ఎవరూ అంటే మాత్రం చటుక్కున లోకేష్ పేరు వస్తుంది. ప్రస్తుతం ఆయన అనధికార అధినేత తెలుగుదేశం పార్టీకి. పైగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అన్ని తానై...
Tammineeni Seetharam

Tammineeni Seetharam: ఏపీలో మారిన అరెస్టుల స్టైల్!

Tammineeni Seetharam: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అరెస్టు భయం వెంటాడుతోంది. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం కేసుల రూపంలో వెంటాడింది. కానీ కొందరు తమ వ్యవహార శైలితో ఏరి కోరి కేసులు తెచ్చుకున్నారు....
Ram Gopal Varma

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...
YSRCP

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...
Oktelugu Epaper