Kaikala Satyanarayana: ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. ఇటీవలే అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ల సాయంలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే, ఆయన పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోందని ఇటీవలే వార్తలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే కైకాల కుమార్తె రమాదేవి స్పందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని అన్నారు. కైకాల సత్యనారాయణ ఆరోగ్యంపై అసత్య ప్రచారం చేయొద్దని కోరారు.
Kaikala Sathyanarayana
వైద్యులు అందిస్తున్న చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని స్పష్టం చేశారు. ప్రస్తుతం అందరితో మాట్లాడుతున్నారని అన్నారు. ఎవరూ ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందొద్దని చెప్పారు. ఎలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని తెలియజేశారు.
కొద్దిరోజుల క్రితం తన నివాసంలో కైకాల కాలు జారిపడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సికింద్రాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందించారు. కాగా, తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో.. జూబ్లీహిల్స్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన త్వరగా కోలుకోవాలని సినీ నటులు, అభిమానులు కోరుకుంటున్నారు.
Also Read: Akhanda: ‘అఖండ’ సినిమా మాస్ వర్క్తో థమన్ ట్వీట్.. నెట్టింట్లో వీడియో వైరల్
కాగా, ఇటీవలే ఆయన పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి తన సతీమణితో కలిసి సత్యనారాయణ నివాసానికి వెళ్లి కాసేపు గడిపారు. కాగా, ఆయన ఆరోగ్యం బాలేదని తెలుసుకున్న చిరు.. వైద్యుల సాయంతో ఆయనకు కాల్ చేసి మాట్లాడారు. ధైర్యంగా ఉండమని మళ్లీ పూర్తి ఆరోగ్యవంతుడిగా తిరిగి ఇంటికి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పినట్లు పేర్కొన్నారు. 60 ఏళ్లుగా సినీ రంగంలో కైకాల.. ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. సుమారు 777 సినిమాల్లో నటించి.. తెలుగు అభిమానులను అలరించారు.
Also Read: Bangarraju Movie: వచ్చేస్తున్న నవ మన్మధుడు… బంగార్రాజు మూవీ నుంచి చైతూ కి బర్త్ డే గిఫ్ట్