Palla Burusu First Review: ‘బలగం’ ఫేమ్ సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘పళ్ళ బురుసు’ అనే సినిమా ఈ నెల 14 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది… ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ మీద నాగార్జున నిర్మిస్తుండటం విశేషం… ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రివ్యూ ని ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలైతే వీక్షించారు. వాళ్లు ఈ సినిమాను చూసి వల అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి…
‘పళ్ల బురుసు’ (బ్రష్) కోసం తండ్రి కొడుకుల మధ్య ఒక పెద్ద యుద్ధ జరుగుతుంది. అది కోర్టు వరకు వెళుతుంది. వీళ్ళిద్దరి మధ్య గొడవ జరగడానికి గల కారణం ఏంటి అనేదే ఈ మూవీ స్టోరీ గా తెలుస్తుంది. ఇక ఏదేమైనా కూడా నాగార్జున లాంటి నటుడు ఇలాంటి ఒక చిన్న సినిమాను నిర్మించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఉదయ్ చౌహాన్ అనే వ్యక్తి ఈ సినిమా ద్వారా డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.
కాబట్టి చాలా బ్యూటిఫుల్ ఎమోషన్స్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తుంది…మూవీ చూసిన సినీ పెద్దలు సైతం సినిమా మీద పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఈ మూవీలోని కొన్ని సన్నివేశాలు ఎమోషనల్ గా ఉండటమే కాకుండా హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయని చెబుతున్నారు.
అలాగే తండ్రి కొడుకులు మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు సైతం ప్రేక్షకుడిని విశేషంగా అలరించాయంటూ వాళ్ళు చెబుతున్నారు. ఏదేమైనా కూడా ఈ సినిమా మరో బలగం లాంటి సక్సెస్ సాధిస్తుందా? ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ను రాబడుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరో రెండు రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కోసం చాలా మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…