Senior NTR: ‘విశ్వవిఖ్యాత నట సార్వభౌమా నందమూరి తారకరామారావు’ అంటే తెలుగు ప్రేక్షకులకు ఎనలేని అభిమానం. అందుకే, నేటికీ ఎన్టీఆర్ ను తలచుకుని తెలుగు నెల పొంగిపోతుంది. నిజానికి.. ఎన్టీఆర్ పై ప్రజలు అంతగా అభిమానాన్ని పెంచుకోవడానికి కారణం.. ఆయన మహా నటుడు అని మాత్రమే కాదు, ఆయన మహా నాయకుడు అని కూడా. అవును, ఎన్టీఆర్ కళకి, కళాకారులకి విలువ పెంచిన కథానాయకుడు మాత్రమే కాదు, తెలుగోడి ఆత్మగౌరవాన్ని దిల్లీ పీఠాన్ని కదిలించేలా వినిపించిన మహానాయకుడు కూడా.
ఎన్టీఆర్ ఎన్నో సాహసోపేతమైన ప్రజారంజక నిర్ణయాలతో ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తెచ్చిన ప్రజానాయకుడు కూడా. మద్రాసీయులమనే పేరుని చెరిపి భారతదేశ పటంలో తెలుగు వాడికి, తెలుగు వేడికి ఒక ప్రత్యేకతను తెచ్చిన తెలుగుజాతి ముద్దు బిడ్డ కూడా. భవిష్యత్తు తరాలకి కూడా స్ఫూర్తినిచ్చే ఎన్టీఆర్ అంటే.. నేటికీ అందుకే అంత క్రేజ్.
ముఖ్యంగా ఎన్టీఆర్ కి సామాన్యుడి కష్టం బాగా తెలుసు. అవి ఎన్టీఆర్ సీఎం అయిన తొలి రోజులు. హోటళ్ల వాళ్ళు జనాలను అడ్డంగా దోచేస్తున్నారు అని ఎన్టీఆర్ భావించారు. కారణం.. ఎన్టీఆర్ ప్రతి రూపాయికి ఎంతో విలువ ఇచ్చేవారు. హోటల్స్ లో ఏ టిఫిన్ ఎంతకి అమ్మాలో కూడా ఎన్టీఆర్ ఓ రేటు నిర్ణయించి జీవో పాస్ చేశారు. ఆ జీవోలో రేట్లు ఇలా ఉన్నాయి.
ఇడ్లీ ప్లేటు పది పైసలు,
దోశ పదిహేను పైసలు,
పూరీ పదిహేను పైసలు,
మసాలా దోశ ఇరవై పైసలు,
ప్లేట్ మీల్స్ అర్ధ రూపాయి.
ఫుల్ మీల్స్ రూపాయి.
ఇలా రేట్లు ఫిక్స్ చేశారు ఎన్టీఆర్. దాంతో హోటల్స్ వాళ్ళు గగ్గోలు పెట్టారు. మరోపక్క మా ఎన్టీవోడు మా కోసం భలే చేశాడు అంటూ జనం కూడా ఎక్కువగా హోటల్స్ లోనే తినడం మొదలెట్టారు. ఇలా కొంత కాలం గడిచాక.. ఇక లాభం లేదు అనుకున్న హోటల్స్ వారంతా బస్సులేసుకొచ్చి అబిడ్స్ లోని ఎన్టీఆర్ ఇంట్లోకి వాలిపోయారు.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’ జెండా గురించి తెలిస్తే.. మీరు షాక్ అవుతారు !
అందరూ.. ఎన్టీఆర్ గారి కాళ్ల మీద పడి.. ‘అయ్యా.. మాకు ఏమి గిట్టుబాటు కావడం లేదయ్యా.. మేము చచ్చిపోతామయ్యా’ అంటూ బావురుమంటే.. ఎన్టీఆర్ ఆ జీవోలో కాస్త సవరణ చేస్తూ.. ఉదయం ఆరింటి నుంచి ఎనిమిదింటి వరకూ టిఫిన్లను నిర్ణయించిన రేట్ల ప్రకారం మాత్రమే అమ్మాలని.. ఇక ఆ తర్వాత హోటల్ వాళ్ల ఇష్టం అని తేల్చి చెప్పారు.
అలాగే, భోజనం కూడా 12 గంటల నుంచి 2 వరకు నిర్ణయించిన రేట్ల ప్రకారం మాత్రమే అమ్మాలని నియమం పెట్టారు. ఆ తర్వాత హోటల్స్ వాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారం అమ్ముకోవచ్చు అని తేల్చారు. నిజానికి అప్పట్లో వడ్డించే కూరలు ఎలా వండాలో కూడా ఎన్టీఆర్ స్వయంగా హోటల్స్ అన్నిటికి ఒక ఫార్మెట్ పంపారట. అలా వండకపోతే హోటల్స్ సీజ్ చేస్తామని నియమం పెట్టారట. ప్రజల గురించి ఎన్టీఆర్ అంత గొప్పగా ఆలోచించే వారు.
Also Read: ఇద్దరు పిల్లల తల్లివి.. పొట్టి బట్టలు వేసుకుంటావా.. స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన అనసూయ