spot_img
Homeఎంటర్టైన్మెంట్Saripodhaa Sanivaaram: 'సరిపోదా శనివారం' చిత్రంలో విలన్ రోల్ ని మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్...

Saripodhaa Sanivaaram: ‘సరిపోదా శనివారం’ చిత్రంలో విలన్ రోల్ ని మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో అతనేనా..? చేసుంటే వేరే రేంజ్ లో ఉండేది!

Saripodhaa Sanivaaram: నేచురల్ స్టార్ నాని నటించిన ‘సరిపోదా శనివారం’ చిత్రం నేడు భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. టీజర్, ట్రైలర్ విడుదలకు ముందు ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అమితాసక్తిని పెంచాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా కూడా ఉండడంతో పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు హీరో నాని కంటే ఎక్కువగా విలన్ గా నటించిన ఎస్ జె సూర్య గురించే ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఇది వరకే మనం ఎస్ జె సూర్య నట విశ్వరూపాన్ని అనేక తమిళ డబ్బింగ్ సినిమాల్లో చూసాము. సోషల్ మీడియాలో అత్యధికంగా ఆయన మీమ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.ఒక సినిమాలో ఎస్ జె సూర్య ఉన్నాడంటే చాలు, ఆ సినిమా సగం హిట్ అయ్యిపోయినట్టే, ఆ రేంజ్ లో నటిస్తాడు ఆయన. అందుకే డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఏరికోరి ఎస్ జె సూర్య ని ఈ సినిమా కోసం తీసుకొచ్చాడు.

అయితే సూర్య కంటే ముందుగా ఒక టాలీవుడ్ యంగ్ హీరోని ఈ సినిమాలో విలన్ రోల్ కోసం తీసుకునేందుకు ప్రయత్నాలు చేశారట. ఆ యంగ్ హీరో మరెవరో కాదు, మంచు మనోజ్. మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మనోజ్, హీరో గా ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసాడు. కానీ మధ్యలో చాలా కాలం గ్యాప్ ఇచ్చి, ఇప్పుడు హీరో రోల్స్ కంటే ఎక్కువగా విలన్ రోల్స్ పై ద్రుష్టి సారిస్తున్నారు. తేజ సజ్జ హీరో గా నటిస్తున్న ‘మిరాయ్’ అనే పాన్ ఇండియన్ చిత్రంలో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడు. సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమా కంటే ముందే మంచు మనోజ్ ని ‘సరిపోదా శనివారం’ చిత్రం కోసం అడిగాడట డైరెక్టర్ వివేక్ ఆత్రేయ.

మనోజ్ కి కథ బాగా నచ్చింది కానీ, క్లైమాక్స్ నచ్చలేదట, మార్చమని చెప్పడంతో డైరెక్టర్ అందుకు ఒప్పుకోలేదు. దాంతో ఈ ప్రాజెక్ట్ లోకి మనోజ్ బదులుగా ఎస్ జె సూర్య వచ్చాడు. అయితే మంచు మనోజ్ ఈ పాత్ర చేసి ఉంటే ఆయనకి నేడు మంచి కం బ్యాక్ అయ్యేది. మనోజ్ కాబట్టి ఆ పాత్రని డైరెక్టర్ మరింత శక్తివంతంగా తీర్చి దిద్దేవాడు. ఇది ఇలా ఉండగా సరిపోదా శనివారం చిత్రానికి ఓపెనింగ్స్ అదిరిపోయాయని ట్రేడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న వార్త. నాని కెరీర్ లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రం ‘దసరా’. కేవలం తెలుగు రాష్ట్రాల నుండే ఈ సినిమాకి మొదటి రోజు 15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ ‘సరిపోదా శనివారం’ చిత్రానికి ఆ స్థాయి వసూళ్లు అయితే రావు కానీ, 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Ram Gopal Varma

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...
YSRCP

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...
Nagarjuna

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...
Music Directors

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...
Y S Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...
Oktelugu Epaper