Surekha Daughter Supritha: తెలుగు సినిమాలో హీరోయిన్లతో సమానంగా లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులకు గుర్తింపు ఉంది. సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలు వీరు నిత్యం యాక్టివ్ గా ఉంటూ అలరిస్తూ ఉంటారు. అలాంటి వారిలో నటి సురేఖావాణి ఒకరు. అక్కగా.. వదినగా.. కొన్ని సినిమాల్లో తల్లి పాత్రలను సైతం పోషించిన సురేఖా వాణికి స్పెషల్ ఇమేజ్ ఉంది. ఆమెకు ఎలాంటి పాత్ర ఇచ్చినా అందులో లీనమైపోయే సురేఖావాణి గురించి నిత్యం సోషల్ మీడియాలో ఏదో టాపిక్ వస్తూనే ఉంటుంది. లేటేస్టుగా ఆమె రెండో పెళ్లి గురించి మరో న్యూస్ వైరల్ అవుతోంది. అ వివరాలేంటో చూద్దాం..
స్కూల్ రోజుల్లోనే సురేఖావాణికి కళలపై ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండేది. ఆమె ఎప్పుడూ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఇంటర్మీడియట్ పూర్తయిన తరువాత యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె మాటీవీలో వచ్చే హార్ట్ బీట్, అనే కార్యక్రమాల్లో నటించింది. ఆ తరువాత మొగుడ్స్ పెళ్లామ్స్ అనే కార్యక్రమానికి యాంకర్ గా చేసింది. ఆ తరువాత 2005లో శీనుగాడు చిరంజీవి ఫ్యాన్స్ అనే సినిమాలో నటించిన ఆమె ఆ తరువాత పలు అవకాశాలు దక్కించుకుంది. ఆ తరువాత భద్ర, దుబాయ్ శీను, బొమ్మరిల్లు సినిమా ద్వారా సురేఖా వాణి ఫేమస్ అయింది.
అయితే సురేఖావాణి భర్త అకాల మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయితే తనకున్ ఒక్కాగానొక్క కూతురే తనకు జీవితం అని పలు మార్లు చెప్పేది. కూతురుతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన సురేఖావాణి అప్పటి నుంచి నెట్టింట్లో పలు పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. లేటేస్టుగా సురేఖావాణి గురించి రెండో పెళ్లి గురించి హాట్ టాపిక్ గా మారింది.
గతంలో సురేఖా వాణి రెండో పెళ్లి చేసుకుంటుందంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలను సురేఖా వాణి ఖండించారు. అయితే లేటేస్టుగా తల్లి బాధ చూడలేక కూతురు సుప్రీత తన తల్లిని రెండో పెళ్లి చేసుకొమ్మని ఫోర్స్ చేసిందని కొందరు పోస్టులు పెట్టారు. అయితే ఇవి కూడా పాల్స్ న్యూస్ అని సురేఖా పేర్కొంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనపై వస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. తన కోసం ఎవరూ వచ్చినా యాక్సెప్ట్ చేసేది లేదంటూ సురేఖా ఫైర్ అవుతున్నారు.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read More