Homeఎంటర్టైన్మెంట్కరోనా పోస్టుపోన్..

కరోనా పోస్టుపోన్..

డ్రాగన్ కంట్రీ లో పుట్టిన కరోనా మహమ్మారి నేడు విశ్వవ్యాప్తంగా అందర్నీ భయపెడుతోంది. ఆ ప్రభావం సినిమా రంగం మీద కూడా బాగానే పడింది. దాంతో పలు సినిమా షూటింగులు వాయిదా పడ్డాయి. చాలా సినిమాల విడుదల తేదీలు కూడా మారాయి. అలా ఎఫెక్ట్ అయిన చిత్రాల్లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చిత్రం కూడా ఉండటం విశేషం. తాజాగా సల్మాన్ ఖాన్ “రాధే” అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం త్వరలో థాయిలాండ్ వెళ్లి కొన్ని యాక్షన్ సీన్లు షూట్ చేయాల్సి ఉంది. కానీ కరోనా ఎఫెక్ట్ తో థాయిలాండ్ షూటింగ్ వాయిదా పడింది.అంతేకాదు ప్రభుదేవా దర్శకత్వంలో షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రాన్ని బక్రీద్ పండుగ సమయంలో విడుదలకు ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడది మారక తప్పేలా లేదు.

ఇదిలా ఉంటే హాలీవుడ్ చిత్రాలకు కూడా కరోనా ముప్పు వాటిల్లింది. ఇంగ్లీష్ చిత్రాల్లో జేమ్స్ బాండ్ చిత్రాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పసి పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ జేమ్స్ బాండ్ చిత్రాలంటే మక్కువ చూపిస్తారు. ఆ క్రమంలో త్వరలో రాబోయే “నో టైం టు డై ” చిత్రం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఆ చిత్రం విడుదల వాయిదా పడింది. నిజానికి ఈ చిత్రం ఏప్రిల్ ప్రారంభం లో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా దెబ్బకి భయపడి ఆరు నెలల తరవాత నవంబర్ 12 న విడుదల చేయబోతున్నారు. కాగా ” నో టైం టు డై ” చిత్రం లో నటిస్తున్న డానియెల్ క్రెగ్ కి ఇది చివరి సినిమా కావడం తో ఆయన అభిమానులు ఒకింత బాధని వ్యక్తం చేస్తున్నారట….slow and steady wins the race

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular