‘వైద్యో నారాయణో హరి’ అని పెద్దలు చెప్పిన మాటకు అర్ధం అంటే తెలిసేలా చేసింది ఈ కరోనా మహమ్మారి. లాక్ డౌన్ లో కూడా సేవ చేయడానికి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవ చేసిన ప్రతి డాక్టర్ గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. కనిపించని దైవం కంటే, ప్రాణం పోసి బ్రతికించే వైద్యుడే గొప్ప. మరి ఆ గొప్ప వ్యక్తి రోజు నేడు.
ఎందరో రోగులకు ప్రాణం పోస్తున్న డాక్టర్లకు ఈ డాక్టర్స్ డే సందర్భంగా కృతజ్ఞతలు చెబుదాం. ఇప్పటికే నేషనల్ డాక్టర్స్ డే అంటూ సినీ సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా ద్వారా డాక్టర్స్ కు అభినందనలు తెలియజేస్తూ వారి విలువను వారి గొప్ప తనాన్ని తమ మాటల రూపంలో ప్రజల మనసుల్లోకి వెళ్లేలా చెబుతున్నారు.
కాగా ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్ ద్వారా డాక్టర్స్ కు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మెసేజ్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ బాగా వైరల్ అవుతుంది. ఇంతకీ మెగాస్టార్ ఏమి పోస్ట్ చేసారంటే.. “నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా నేను డాక్టర్స్ కు ప్రత్యేకంగా సెల్యూట్ చేస్తున్నాను. ఈ లోకంలో డాక్టర్స్ మాత్రమే ఇతరుల ప్రాణాలను కాపాడుతారు.
అందుకే మనం వైద్యులను సర్వ శక్తివంతమైన దేవుని రూపాలుగా భావిస్తాం. అందుకే మన పెద్దలు వైద్యో నారాయణో హరి అని సంబోధించారు. ప్రపంచ ఆరోగ్య సంక్షోభ సమయం అయిన ఈ కరోనా కాలంలో ఈ వాస్తవం మనకు అర్థమయ్యేలా చేసింది. అందుకే ఇప్పుడు, ఎప్పుడూ వారికి కృతజ్ఞులై ఉందాం” అని మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ చేశారు.
Saluting ALL the Doctors on this #NationalDoctorsDay.Doctors are the ONLY beings who could save lives.#VaidyoNarayanoHarihi Doctors are the Human forms of Almighty GOD!During this global health crisis this fact has been reinforced yet again.Lets be grateful to them now & always!
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 1, 2021