ప్రస్తుతం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో #ప్రభాస్20 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.. తన 20వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్ మరొక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి ” మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా సైన్స్ ఫిక్షన్ మూవీ #ప్రభాస్21 రూపొందనుంది. ఈ మూవీ లో ప్రభాస్ కు జోడీ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పడుకొనే ను ఎంపిక చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేసినట్టు , దీపిక ను సంప్రదించినట్టు సమాచారం. దీపిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే #ప్రభాస్21 మూవీ ఆమెకు ఫస్ట్ టాలీవుడ్ మూవీ అవుతుంది.దీని గురించి అధికార ప్రకటన రావలిసి ఉంది.