Homeఎంటర్టైన్మెంట్‘దబాంగ్’ దర్శకుడిపై కేసు పెడతామంటున్న సల్మాన్‌ అన్న

‘దబాంగ్’ దర్శకుడిపై కేసు పెడతామంటున్న సల్మాన్‌ అన్న


బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ అతని కుంటుంబం తన జీవితాన్ని నాశనం చేశారంటూ ‘దబాంగ్‌’ దర్శకుడు అభినవ్‌ కశ్యప్‌ సోషల్‌ మీడియా వేదికగా ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది. బాలీవుడ్‌లో కొంత మంది పెద్దలు దివంగత సుశాంత్‌ సింగ్‌కు అవకాశాలు రాకుండా అడ్డుకున్నారని, అందుకే అతను ఆత్మహత్య చేసుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సల్మాన్‌ ఖాన్‌ ఫ్యామిలీ తనను ఇబ్బందులు గురిచేసిందని అభినవ్‌ ఆరోపించడం సంచలనం సృష్టించింది. దబాంగ్’‌ సీక్వెల్‌ను కూడా తానే చేయాల్సి ఉండేదని, అయితే సల్మాన్‌ సోదరులు అర్బాజ్‌, సోహైల్‌లు ‘దబాంగ్‌ 2’ నుంచి తప్పుకోవాలని తనని బెదిరించారని చెప్పాడు. అలాగే, 2013లో తన బేషారం చిత్రం విడుదలను అడ్డుకోవాలని ప్రయత్నించారని కశ్యప్‌ ఆరోపించాడు. దాంతో, సోషల్‌ మీడియాలో ‘బ్యాన్ సల్మాన్‌ ఖాన్’ ట్రెండ్‌ అయింది.

అయితే, తన ఫ్యామిలీపై అభినవ్‌ చేసిన ఆరోపణలపై సల్మాన్‌ అన్న, నటుడు నిర్మాత అర్బాజ్‌ ఖాన్‌ స్పందించాడు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పాడు. తనను, తన సోదరులు సల్మాన్‌ ఖాన్‌, సోహైల్‌ ఖాన్‌, తండ్రి సలీం ఖాన్‌లపై సోషల్‌ మీడియాలో కశ్యప్‌ తప్పుడు ప్రచారం చేస్తూ‌ వేధిస్తున్నాడని ఆరోపించాడు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కేసు పెట్టాలని నిర్ణయించుకున్నామని తెలిపాడు. ‘అభినవ్‌ డైరెక్ట్‌ చేసిన 2010 చిత్రం ‘దబాంగ్‌’లో నేను, సల్మాన్ నటించాం. ఆ తర్వాత ‘దబాంగ్‌-2’ నుంచి అభినవ్‌ తప్పుకున్నాడు. అప్పటీ నుంచి మా మధ్య ఎలాంటి సంబంధం లేదు. కనీసం మాట్లాడుకుంది లేదు. ప్రొఫెషనల్‌గా మేం విడిపోయాం. అయినా ఇలాంటి ఆరోపణలు అభినవ్‌ ఎందుకు చేస్తున్నాడో అర్థం కావడం లేదు. త్వరలోనే మేం కశ్యప్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని స్పష్టం చేశాడు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular