యంగ్ హీరో నిఖిల్ సినీ కెరీర్ లో మైలు రాయి అనదగ్గ చిత్రం ` కార్తికేయ `అనడం లో ఎటువంటి సందేహం అక్కరలేదు. 2014 అక్టోబర్ 24 న విడుదలైన ఈ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. కేవలం 6 కోట్ల బడ్జట్ తో రూపొందిన ఈ చిత్రం 20 కోట్ల షేర్ రాబట్టి అందర్నీ ఆశ్చర్య పర్చింది. చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ‘కార్తికేయ’ చిత్రం నిఖిల్ సిద్దార్ధ్ కే హీరోగా భారీ విజయాన్ని సాధించింది.ఇక ఈ సినిమాలో కథానాయికగా నటించిన ‘కలర్స్’ స్వాతి కి కూడా మంచి పేరు వచ్చింది . ఆమె కెరియర్లో చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. అలాంటి సినిమాకి ‘కార్తికేయ 2’ టైటిల్ తో సీక్వెల్ రూపొందుతోంది.
కాగా ఈ సినిమాలో కూడా ‘కలర్స్’ స్వాతి హీరోయిన్ గా చేయనున్నట్టు రక రకాల వార్తలు వచ్చాయి. అది నిజమే గాని ఆమె పాత్ర హీరోయిన్ కాదు .. ఈ సినిమాలో ఆమె హీరోకి మాజీ లవర్ గా కనిపించనుందని అంటున్నారు. పెళ్ళైన తరువాత ‘కలర్స్’ స్వాతి చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఇక ఈ సినిమాలో ప్రధాన కథానాయిక పాత్ర కోసం మళయాళీ బొద్దు భామ అనుపమ పరమేశ్వరన్ ను తీసుకుంటున్నారట.. నిఖిల్ సిద్దార్ధ్ హీరోగా , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ ఫై విశ్వప్రసాద్ మరియు అభిషేక్ అగర్వాల్ సంయుక్తం గా నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Anupama parameswaran in karthikeya 2
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com