Homeఎంటర్టైన్మెంట్Balakrishna: బాలయ్యకు మేజర్ ఆపరేషన్.. దర్శకుడు క్రిష్ వల్లే.. ఏం జరిగిందంటే?

Balakrishna: బాలయ్యకు మేజర్ ఆపరేషన్.. దర్శకుడు క్రిష్ వల్లే.. ఏం జరిగిందంటే?

Balakrishna: టాలీవుడ్ అగ్రహీరో బాలయ్యకు ఓ గాయం మూడేళ్లుగా వేధిస్తోంది. ఆపరేషన్ చేసినా తగ్గనంటోంది. ఆయన భుజాన్ని నొప్పితో విలవిలలాడిస్తోంది. ఒకసారి ఆపరేషన్ జరిగినా ఆయన భుజం గాయం తగ్గలేదు. దీంతో రెండోసారి తాజాగా ఆపరేషన్ చేశారు.

Balayya
Balakrishna

అగ్రహీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలక్రిష్ణ ఆస్పత్రిలో చేరారు. గత ఆరునెలలుగా ఇబ్బంది పెడుతున్న భుజానికి మేజర్ ఆపరేషన్ చేయించుకున్నారు. అక్టోబర్ 31న బాలయ్య చికిత్స నిమిత్తం బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చేరారు. ప్రముఖ ఆర్థోపెడిక్ బృందం ఆయనకు నాలుగు గంటల పాటు శ్రమించి విజయవంతంగా శస్త్రచికిత్సను నిర్వహించింది. ప్రస్తుతం బాలయ్య ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లుగా వైద్యులు తెలిపారు.

బాలయ్యకు ఈ భుజం గాయం ఇప్పటిది కాదు.. 2018లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ మూవీ షూటింగ్ సందర్భంగా ఫైట్ సీన్ చేస్తున్న సమయంలో బాలయ్య కింద పడిపోయాడు. భుజానికి తీవ్ర గాయమైంది. నొప్పితో విలవిల లాడడంతో బాలయ్యకు 2018లోనే హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేశారు.

అయినా కూడా బాలయ్య భుజం గాయం తగ్గలేదు. ప్రస్తుతం ‘అఖండ’ సినిమా షూటింగ్ లోనూ తాజాగా ఆహా ఓటీటీకి చేస్తున్న షో ‘అన్ స్టాపబుల్’ కార్యక్రమంలోనూ బాలయ్య భుజం గాయం వేధించింది.దీంతో ఇక ఆగకూడదని బాలయ్య ఆస్పత్రిలో చేరి ఈ ఆపరేషన్ చేయించుకున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular