spot_img
Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 8 Telugu: నాగార్జున దృష్టిలో ఫ్లాప్ కంటెస్టెంట్స్ వీళ్ళే..పద్దతి మార్చుకోకుంటే వచ్చే వారం...

Bigg Boss 8 Telugu: నాగార్జున దృష్టిలో ఫ్లాప్ కంటెస్టెంట్స్ వీళ్ళే..పద్దతి మార్చుకోకుంటే వచ్చే వారం ఎలిమినేషన్!

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున ని మించిన వారు మరొకరు లేరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. కంటెస్టెంట్స్ మరీ కఠినంగా వ్యవహరించకుండా, తన పరిధి ని దాటకుండా వ్యవహరించడం, కంటెస్టెంట్స్ చేస్తున్న తప్పులను ఎత్తిచూపడం లో నాగార్జున ని మించిన వారు మరొకరు లేరు. అందుకే మూడవ సీజన్ నుండి 8 సీజన్ వరకు బిగ్ బాస్ టీం కి ఎన్నో ఛాయిస్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నాగార్జున ని వదలడం లేదు. ఇక ఈరోజు జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున కంటెస్టెంట్స్ చాలా సున్నితంగా రఫ్ఫాడించేసాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ సీజన్ లో కంటెస్టెంట్స్ కి సంబంధించిన రివ్యూస్ ని నాగార్జున ఒక్కడే చెప్పేవాడు. కానీ ఈ సీజన్ లో కాస్త కొత్తగా ఉండేందుకు కోసం కంటెస్టెంట్స్ తోనే రివ్యూస్ చెప్పించే ప్రయత్నం చేసాడు.

అలా సాగిన ఈ చర్చలు హీట్ వాతావరణంలోకి వెళ్ళింది. ఆ తర్వాత నాగార్జున చివర్లో కొంతమంది ఫ్లాప్ కంటెస్టెంట్స్ పేర్లను చెప్పి, వాళ్ళ పేర్లతో ఉన్న మసుకులను సుత్తి తీసుకొని పగలగొట్టాడు. ముందుగా ప్రేరణ మాస్కు పెట్టి, ఆ మాస్కుని సుత్తితో పగలగొడుతాడు నాగార్జున. ఆ తర్వాత ప్రేరణతో మాట్లాడుతూ హౌస్ లోకి అడుగుపెట్టే ముందే ఎంత హుషారుగా ఉన్నావు, ఎంత బాగా మాట్లాడావు, టాస్కులు కూడా ఇరగదీస్తావు అనుకున్నాను, కానీ మా అంచనాలను ఏమాత్రం అందుకోలేదు ప్రేరణ, ఈ వారం నువ్వు టోటల్ గా ఫ్లాప్ అయ్యావు, వచ్చే వారంలో మా అంచనాలకు రీచ్ అవ్వాలి అని అంటాడు. అప్పుడు ప్రేరణ మీ అంచనాలకు మించే నా పెర్ఫార్మన్స్ ని మెరుగుపర్చుకుంటాను సార్ అని అంటుంది. ప్రేరణ తర్వాత నాగార్జున సీత కి సంబంధించిన మాస్కుని తగిలించి పగలగొడుతాడు. ఆ తర్వాత ఆమెతో మాట్లాడుతూ సీత నువ్వు చాలా కేరింగ్ ఉన్న అమ్మాయివి, అదే సమయంలో బాధ్యతతో వ్యవహరించే అమ్మాయివి కూడా, నేను నిన్ను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనుకుంటున్నాను కానీ నీలో ఉన్న లక్షణాలు మొత్తం ఏమి అయ్యాయి?, నీ పేరు నుండి కేవలం సీత మాత్రమే నాకు కనిపిస్తుంది, కిరాక్ పోయింది, నాకు వచ్చే వారం ఆ కిరాక్ సీత తిరిగి రావాలి అని అంటాడు నాగార్జున. వీళ్లిద్దరి తర్వాత నాగార్జున బేబక్క కి సంబంధించిన మాస్కుని తగిలించి పగలగొడుతాడు. ఆ తర్వాత ఆమెతో మాట్లాడుతూ వేరే లీడర్ క్లాన్ లోకి నువ్వు వెళ్లడం కాదు, నీకు నువ్వే లీడర్ అవ్వాలి అని అంటాడు నాగార్జున, దానికి బేబక్క సమాధానం చెప్తూ ‘అవును సార్..అందుకే ఈరోజు ఓపెన్ అయిపోయాను’ అని చెప్పుకొచ్చింది.

ఇక ఆ తర్వాత ఆదిత్య ని ఫ్లాప్ కంటెస్టెంట్స్ లిస్ట్ లోకి చేర్చి అతని మాస్కుని కూడా పగలగొడుతాడు నాగార్జున, ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ ఆటలోకి ముందుకు రా, కంటెస్టెంట్స్ అడ్రెసులు కనుక్కోవడం కాదు, కంటెస్టెంట్స్ తో బాగా కలవు అంటూ ఆదిత్య కి క్లాస్ పీకాడు. ఇక చివర్లో విష్ణు ప్రియా గురించి మాట్లాడుతూ నీకు నువ్వు చాలా స్ట్రాంగ్ మ్యాచో అని అనుకుంటున్నావు కదా , అది కరెక్ట్ కాదు అమ్మా, నువ్వు ప్రవర్తించే తీరుని బట్టి కూడా ఆడియన్స్ నిన్ను జడ్జ్ చేస్తారు అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున. ఇలా ఈ 5 మందిని ఫ్లాప్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో చేర్చిన నాగార్జున, వచ్చే వారంలో వీరిలో ఎంతమందిని బయటకి తీస్తాడో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి కెరియర్ లో చేసిన మూడు తప్పులు ఇవే…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒక సామాన్య మానవుడు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా మారవచ్చు అని ప్రూవ్ చేసిన...
Vijay Deverakonda

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ వెనక ఇన్ని కారణాలున్నాయి…

Vijay Deverakonda: 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ... ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా...
Ramayana Trailer Postponed

Ramayana Trailer Postponed: ‘రామాయన్ ‘ ట్రైలర్ విడుదల వాయిదా.. సంచలనం రేపుతున్న పోస్ట్..

Ramayana Trailer Postponed: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామాయన్' మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చెయ్యాలని...
Super El Nino

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...
Oktelugu Epaper