కరోనా మహమ్మారి దెబ్బకు దేశవ్యాప్తంగా సినీ రంగం కకావికలమైపోయింది. దాదాపు అన్నిచోట్లా సినిమా షూటింగులు ఆపేశారు. ఒకటీరెండు సినిమాలు మాత్రమే కట్టుదిట్టమైన భద్రత నడుమ ముందుకు సాగుతున్నాయి. అయితే.. ప్రభాస్ ‘ఆదిపురుష్’ అన్నిటికన్నా ముందుగానే నిలిచిపోయింది. మహారాష్ట్ర సర్కారు ఏప్రిల్ 14న కఠిన ఆదేశాలు జారీచేయడంతో.. వ్యాపారాలు మొదలు షూటింగుల దాకా అన్నీ స్తంభించిపోయాయి. అప్పటి నుంచి ఈ షూట్ నిలిచిపోయింది.
కాగా.. ఇప్పుడు ఈ సినిమా షూట్ తిరిగి మొదలు పెట్టాలని చూస్తున్నాడట దర్శకుడు ఓం రౌత్. అయితే.. ముంబైలో కాదు.. హైదరాబాద్ లో! అవును.. ఇక్కడ షూటింగులపై నియంత్రణ లేకపోవడంతో.. యూనిట్ మొత్తం ఇక్కడికి వచ్చేయాలని చూస్తోందట.
అందుతున్న సమాచారం ప్రకారం.. ఆదిపురుష్ షూటింగ్ ఇంకా 90 రోజులు బ్యాలెన్స్ ఉందట. ఈ సినిమా ఎక్కువ భాగం సీజీ వర్క్స్ మీదనే నడిపించాల్సి ఉంది. అందువల్ల.. ఓపెన్ సాగే షూట్ ను ఫినిష్ చేసుకుంటే.. ఇండోర్ లో కూర్చొని గ్రాఫిక్స్ వర్క్ ను ప్రశాంతంగా కొనసాగించొచ్చని భావిస్తున్నారట.
అంతా ఓకే అంటే.. వచ్చేవారమే హైదరాబాద్ ల్యాండ్ అయిపోతాడట ఆదిపురుష్. ఈ మేరకు సీత పాత్ర పోషిస్తున్న కృతి సనన్, రావణుడిగా కనిపించనున్న సైఫ్ అలీఖాన్ అంగీకరించారట. మిగిలిన వాళ్లను కూడా సంప్రదించి, చాలా తక్కువ మంది క్రూతో భాగ్యనగరంలో వాలిపోనున్నట్టు సమాచారం. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.