TTD: టెన్త్, ఇంటర్ విద్యార్థులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. టిటిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) బీఎస్సీ నర్సింగ్, బీపీటీ (ఫిజి యోథెరపీ), బీఎస్సీ ఏహెచ్ఎస్(పారామెడికల్) లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ ఈఏపీసెట్ 2024 ర్యాంక్, కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయిస్తారు.
బిఎస్సి నర్సింగ్ లో 100 సీట్లు..
బీఎస్సీ నర్సింగ్ చేయదలచిన వారికి ప్రోగ్రామ్ వ్యవధి నాలుగేళ్లు. మొత్తం 100 సీట్లు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటా అభ్యర్ధులకు పది సీట్లు కేటాయించారు. కోర్సు ఫీజు ఏడాదికి రూ.41 వేలు. ఈ ప్రోగ్రామ్కు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్( ఐఎస్సీ) గుర్తింపు ఉంది.
బీపీటీ కోర్సులో 50 సీట్లు..
బీపీటీ కోర్స్ చేయదలచిన వారికి ప్రోగ్రామ్ వ్యవధి నాలుగున్నరేళ్లు. ఇందులో ఎనిమిది సెమిస్టర్లు, ఆరు నెలల ఇంటర్నెట్ షిప్ ఉంటాయి. మొత్తం 50 సీట్లు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు అయిదు సీట్లు ప్రత్యేకించారు. ప్రోగ్రామ్ ఫీజు ఏడాదికి రూ.41 వేలు. ఈ ప్రోగ్రామ్ కు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్స్(ఐఏపీ) గుర్తింపు ఉందన్నారు.
బీఎస్సీ పారామెడికల్ కోర్సు..
బీఎస్సీ(పారామెడికల్) కోర్సు ప్రోగ్రామ్ వ్యవధి నాలుగేళ్లు. ఇందులో ఆరు సెమిస్టర్లు, ఏడాది ఇంటర్నెట్ షిప్ ఉంటాయి. ప్రోగ్రామ్ ఫీజు ఏడాదికి రూ.29 వేలు. ఈ ప్రోగ్రామ్ కు ఏపీ పారామెడికల్ బోర్డు గుర్తింపు ఉంది.
స్పెషలైజేషన్లు-సీట్ల వివరాలు..
అనస్తీషియా టెక్నాలజీ 12, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ 20, రేడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ 9, కార్డియాక్ పల్మ సరీ పెర్ఫ్యూజన్ టెక్నాలజీ 2, ఈసీజీ అండ్ కార్డియోవాస్క్యులర్ టెక్నాలజీ 8. డయాలసిస్ టెక్నాలజీ 12, ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ టెక్నాలజీ 1. న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ 4, రేడియోథెరపీ టెక్నాలజీ 5, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ 2 ఉన్నాయి.
అర్హత వివరాలు
గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంగ్లీష్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్/12వ తరగతి/తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైనవారు, సంబంధిత విభాగంలో ఇంటర్ ఒకేషనల్ ప్రోగ్రామ్ పూర్తిచేసినవారు, ఇంటర్ ఒకేషనల్ తోపాటు సంబంధిత బ్రిడ్జ్ కోర్సు ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 45 శాతం మార్కులు ఉండాలి. ఏఐఎస్ఎస్సీఈ/ ఐసీఎస్ఈ/ఎస్ఎస్సీఈ/ హెచ్ఎస్సీఈ/ఎన్ఐఐఓఎస్ అభ్యర్థులు కూడా అర్హులే.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More