Homeక్రైమ్‌Watermelon Poisoning: పుచ్చకాయ, బిర్యానీ వల్ల కాదట.. ఆ కుటుంబం చనిపోవడం వెనుక జరిగింది ఇదీ

Watermelon Poisoning: పుచ్చకాయ, బిర్యానీ వల్ల కాదట.. ఆ కుటుంబం చనిపోవడం వెనుక జరిగింది ఇదీ

Watermelon Poisoning: బిర్యానీ తిన్న తర్వాత.. పుచ్చకాయను ఆరగించిన తర్వాత ఒక కుటుంబం కన్ను మూసింది. ముంబై నగరంలో జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయను ఆరగిస్తే ఇంతటి ప్రమాదమా అని అందరూ ఆశ్చర్యపోయారు. కొంతమంది ఇటువంటి ఫుడ్ పాయిజనింగ్ ఇంతవరకు చూడలేదని వ్యాఖ్యానించారు. ఏకంగా నలుగురు చనిపోవడం ఆందోళన కలిగించిందని చాలామంది పోషకాహార నిపుణులు పేర్కొన్నారు.

ఈ ఘటన తర్వాత దేశ వ్యాప్తంగా పుచ్చకాయ ధరలు పడిపోయాయి. అనేక పరీక్షల తర్వాత ఆ నలుగురి మరణానికి పుచ్చకాయ కారణం కాదని పరీక్షలలో తెలింది. ఫోరెన్సిక్ టెస్టులలో ఆందోళన కలిగించే నిజాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఆ నలుగురిపై విష ప్రయోగం జరిగిందని.. అందువల్లే వారు చనిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి.. ముంబై నగరంలో మొబైల్ దుకాణం నడిపే అబ్దుల్లా.. అతని భార్య.. ఇద్దరు అమ్మాయిలు శనివారం రాత్రి బంధువులతో కలిసి మటన్ బిర్యానీ ఆరగించారు. వారి ఇంటి నుంచి బంధువులు వెళ్లిపోయిన తర్వాత ఆ కుటుంబం అర్ధరాత్రి సమయంలో పుచ్చకాయ తిన్నది. ఆ తర్వాత ఉదయానికి వారంతా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు చేసుకున్నారు. విరోచనాలు కూడా అయ్యాయి. కొద్దిసేపటికి వారంతా ఒకరి తర్వాత ఒకరి చనిపోయారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.

బిర్యాని తిన్న తర్వాత.. పుచ్చకాయ ఆరగించడం ఆరోగ్యానికి మంచిది కాదని అనేకమంది విశ్లేషణలు చేశారు. ఇక సోషల్ మీడియాలో అయితే విపరీతంగా ప్రచారం కూడా జరిగింది. ఆ నలుగురి మృతదేహాలకు పోస్టుమార్టం చేసిన తర్వాత దారుణమైన నిజం వెలుగులోకి వచ్చింది. ఫోరెన్సిక్ పరీక్షలో ఎవరూ ఊహించని విధంగా ఆ నలుగురు అత్యంత ప్రాణాంతకమైన ఎలుకల మందు వల్ల చనిపోయారని తెలిసింది. అయితే వారు తిన్న పుచ్చకాయలు ఎలుకలను చంపడానికి ఉపయోగించే రసాయనం ఉన్నట్టు పరీక్షలలో తేలింది. చనిపోయిన వారి మెదడు.. గుండె.. ఇతర అవయవాలు ఆకుపచ్చగా మారిపోయాయి. వారి శరీరాలలో జింక్ పాస్ఫెట్ ఉందని.. అందువల్లే స్వల్ప కాలంలోనే వాడు చనిపోయారని వైద్యులు వెల్లడించారు. పుచ్చకాయలో ఈ రసాయనం ఎలా ఉంది.. దీనిని ఎవరు చేశారు.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular