Homeఆంధ్రప్రదేశ్‌APSRTC: ఏపీఎస్ఆర్టీసీ మంచి నిర్ణయం

APSRTC: ఏపీఎస్ఆర్టీసీ మంచి నిర్ణయం

APSRTC: ఏపీఎస్ఆర్టీసీ ( APSRTC) ఒక మంచి నిర్ణయం తీసుకుంది. దీనిపై అభినందనలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన సంగతి తెలిసిందె. దాదాపు ఏడాది సమీపిస్తుంది ఈ ఉచిత పథకానికి. గత సంవత్సరం ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రారంభం అయింది. లక్షలాది మంది మహిళలు ప్రతిరోజు ఆర్టిసి ఉచిత ప్రయాణ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. బస్సులు సైతం మహిళలతో రద్దీగా మారుతున్నాయి. అయితే ప్రయాణికుల రద్దీతో పాటు […]

APSRTC: ఏపీఎస్ఆర్టీసీ ( APSRTC) ఒక మంచి నిర్ణయం తీసుకుంది. దీనిపై అభినందనలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన సంగతి తెలిసిందె. దాదాపు ఏడాది సమీపిస్తుంది ఈ ఉచిత పథకానికి. గత సంవత్సరం ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రారంభం అయింది. లక్షలాది మంది మహిళలు ప్రతిరోజు ఆర్టిసి ఉచిత ప్రయాణ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. బస్సులు సైతం మహిళలతో రద్దీగా మారుతున్నాయి. అయితే ప్రయాణికుల రద్దీతో పాటు వేసవి దృష్ట్యా ఏపీఎస్ఆర్టీసీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ కాంప్లెక్స్ ఇలా ప్రాంగణంలో ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడం అభినందనలు అందుకుంటుంది. ఈ విషయంలో సంబంధిత మంత్రి రాంప్రసాద్ రెడ్డిని ఎక్కువమంది అభినందిస్తున్నారు. మంచి ఆలోచనగా చెబుతున్నారు.

* వేసవి ప్రయాణాలు..
సాధారణంగా వేసవిలో ప్రయాణాలు అంటేనే ఒక రకమైన ఆందోళన ఉంటుంది. ఇబ్బందికర పరిస్థితులు కూడా ఉంటాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు 45 డిగ్రీలు దాటుతున్నాయి. ఇటువంటి సమయంలో ప్రయాణాలు అంటే ఇబ్బంది కరం. భారీ ఉష్ణోగ్రతలు, తీవ్ర వడగాలుల మధ్య ప్రయాణాలు సాగించడం అంత సులువు కాదు. ఒక్క నీడ మాత్రమే కాదు తాగునీటి సమస్య కూడా ఉంటుంది ఈ కాలంలో. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం సాహస నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణాల్లో భారీ టెంట్ల ఏర్పాటు చేస్తున్నారు. తాగునీరు అందుబాటులో ఉంచుతున్నారు. నిజంగా ఇది గొప్ప విషయం కూడా.

* ఇబ్బందులు లేకుండా..
చాలా ఆర్టీసీ కాంప్లెక్స్ లలో తాగునీటి వసతి లేదు. ఆపై ప్రయాణికుల రద్దీతో అక్కడ కూర్చునేందుకు కూడా ఖాళీలు కనిపించవు. దీనిని ముందుగానే గుర్తించింది ఏపీ ప్రభుత్వం. అందుకే ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణాల్లో భారీ టెంట్లు వేసి.. ప్రత్యేకంగా కొన్ని బెంచీలను ఏర్పాటు చేస్తున్నారు. అక్కడే తాగునీరు కూడా కల్పిస్తున్నారు. ముందుగా పెద్ద నగరాలతో పాటు జిల్లా కేంద్రాల్లో ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ లలో ఈ ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మిగతా చోట్ల కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టీసీ చర్యలపై ప్రజల్లో సంతృప్తి కనిపిస్తోంది. మంచి ఆలోచన అన్నట్టు ఎక్కువమంది అభినందిస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper