Homeఆంధ్రప్రదేశ్‌Anantapur District Crime News: భార్యలపై అనుమానంతో.. ఈ భర్తలు ఎంతటి దారుణానికి ఒడి కట్టారంటే?

Anantapur District Crime News: భార్యలపై అనుమానంతో.. ఈ భర్తలు ఎంతటి దారుణానికి ఒడి కట్టారంటే?

Anantapur District Crime News: అనుమానం అనేది మనిషిని స్థిరంగా ఉంచదు. వారిలో రకరకాల ప్రతికూల ఆలోచనలను ప్రేరేపిస్తుంది. చివరికి దారుణాలకు పాల్పడే విధంగా నడిపిస్తూ ఉంటుంది. ప్రతికూల భావంతో చివరికి ఎంతటి ఘోరాల కైనా వారు పాల్పడుతూ ఉంటారు. ఆ సమయంలో తాను మనుషులమనే విషయాన్ని మర్చిపోయి.. మృగాల మాదిరిగా ప్రవర్తిస్తూ ఉంటారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో రెండు దారుణాలు చోటు చేసుకున్నాయి. ఈ దారుణాలలో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. వారు ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణం భర్తలు. సూటిగా చెప్పాలంటే భర్తల చేతుల్లో వారు ప్రాణాలు కోల్పోయారు.

అనంతపురం జిల్లా కేంద్రంలోని నగరం బిందెల కాలనీ లో లక్ష్మీ గంగ, వీరాంజనేయులు నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఆరు సంవత్సరాల కుమారుడు, నాలుగు సంవత్సరాల కుమార్తె ఉంది. లక్ష్మి, వీరాంజనేయులు ప్రేమించి పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. మొదట్లో వీరి సంసారం బాగానే నడిచింది. లక్ష్మీ ఇటీవల మరొక వ్యక్తితో సంబంధం కొనసాగిస్తుందని వీరాంజనేయులు అనుమానించడం మొదలు పెట్టాడు. కొంతకాలం క్రితం నుంచి దంపతులిద్దరూ వేరువేరుగానే ఉంటున్నారు.. ఇటీవల పెద్ద మనుషులు పంచాయతీ చేశారు. దీంతో వీరాంజనేయులు లక్ష్మీని ఇంటికి తీసుకొచ్చాడు. లక్ష్మీ ఇంటికి వచ్చినప్పటి నుంచి వీరాంజనేయులు మళ్లీ గొడవ పడడం మొదలుపెట్టాడు. ఆవేశంలో లక్ష్మిని కత్తితో నరికాడు. ఆ తర్వాత ఇద్దరు పిల్లలతో పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు.

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ముద్రాసి కాలనీలో కుళ్లాయమ్మ, మారెన్న దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. మారెన్న లారీ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. మారెన్న కొద్దిరోజులుగా భార్య మీద అనుమానం పెంచుకున్నాడు.. అనంతపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశాడు. ఇటీవల కుళ్లాయమ్మ సంక్రాంతి పండుగకు పుట్టింటికి వెళ్ళింది. మారెన్న కూడా అత్తింటివారికి వెళ్ళాడు. అక్కడ ఇద్దరికీ గొడవైంది. ఆరోజు రాత్రి కుళ్లాయమ్మను మారెన్న విచక్షణ రహితంగా నరికాడు. కుటుంబ సభ్యులు కుళ్లాయమ్మను ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది.

వాస్తవానికి ఈ రెండు సంఘటనలు సమాజంలో మృగాల మాదిరిగా ప్రవర్తిస్తున్న కొంతమంది భర్తల తీరును తేట తెల్లం చేస్తున్నాయి. వాస్తవానికి అనుమానం అనేది ఒక రోగం లాంటిది. అది ఒకసారి మగాడిలో ఆవహిస్తే.. ఇక ఏం చేసినా ఉపయోగం ఉండదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

AP Government Door To Door Campaign

AP Government Door To Door Campaign: చేసింది చెప్పేందుకు…ఏపీలో 45 రోజుల కూటమి ప్రచారం!

AP Government Door To Door Campaign: ఏపీలో టీడీపీ కూటమి పాలన రెండేళ్లు పూర్తి చేసుకుంది. మరో మూడేళ్ల పాలన ఉంది. తొలి రెండేళ్లు కూటమి పాలనపై సంతృప్తి శాతం అధికంగా...
Ranganath Controversy

Ranganath Controversy: ఆ భూమే.. హైడ్రా రంగనాథ్ కు ఇబ్బందికరం.. ఇంతకీ ఆ వివాదం ఏంటంటే..

Ranganath Controversy: హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ హైదరాబాద్ నగరంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. అక్రమార్కుల భరతం పడుతున్నారు. భూకబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టేలా చేస్తున్నారు. ప్రభుత్వం ఆయనకు పూర్తి స్వేచ్ఛ...
HYDRA Ranganath

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ ను రేవంత్ వదులుకోరు.. ఎందుకంటే..

HYDRA Ranganath: హైకోర్టు వ్యాఖ్యల తర్వాత.. భారత రాష్ట్ర సమితి.. భారతీయ జనతా పార్టీ హ్యాపీగా ఉండవచ్చు. కొంతమంది కబ్జాదారులు కూడా సంతోషంగా ఉండవచ్చు. కానీ హైడ్రా రంగనాథ్ విషయంలో రేవంత్ రెడ్డి...
Hot vs Cold Shower

Hot vs Cold Shower: వేడి నీరు.. చల్లటి నీరు.. ఏ స్నానం మంచిది..

Hot vs Cold Shower: ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల కేవలం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే కాదు.. మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటుంది. అయితే వేడినీటితో స్నానం చేయడం మంచిదా?...
Today 28 July 2026 Horoscope

Today 28 July 2026 Horoscope: ఈ రాశి వారికి ఈ రోజు పదోన్నతి వచ్చే అవకాశం.....

Today 28 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈ రోజు అనుకోకుండా ధన లాభం...
Oktelugu Epaper