Homeక్రైమ్‌Gujarat: స్పైడర్ లో ఎస్జే సూర్య కూడా వీడి ముందు దిగదుడుపే.. వీడు మామూలు సైకో...

Gujarat: స్పైడర్ లో ఎస్జే సూర్య కూడా వీడి ముందు దిగదుడుపే.. వీడు మామూలు సైకో కాదు.. అతని వికృత చేష్టలకు ఎంతమంది బలయ్యారంటే..

Gujarat: వాడి పేరు రాహుల్ జాట్. స్వస్థలం హర్యానా.. వయసు 29 సంవత్సరాలు.. ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే రాహుల్ కు పోలి వచ్చింది. ఎడమకాలు వైకల్యం బారిన పడింది. 2018- 19లో ట్రక్ లో దొంగతనానికి పాల్పడ్డాడు. అలా పోలీసులకు చిక్కాడు. బయటికి వచ్చిన తర్వాత ఆయుధాలను అక్రమంగా రవాణా చేయడం మొదలుపెట్టాడు. అలా రాజస్థాన్ పోలీసులకు దొరికాడు. ఆ తర్వాత వివిధ నేరాలు చేసి హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ పోలీసులకు దొరికాడు. జైలు శిక్ష అనుభవించి బయటికి వచ్చాడు. ఆ తర్వాత రాజస్థాన్ లోని జోద్ పూర్ ప్రాంతంలో ఓ కేసులో పోలీసులకు దొరికి వెళ్ళాడు.. కొంతకాలం శిక్ష అనుభవించి ఈనెల 14న విడుదలయ్యాడు. అలా అతడు గుజరాత్ చేరుకున్నాడు..

గుజరాత్ రాష్ట్రంలోని ఉద్వాడ ప్రాంతంలో రైలు పట్టాల పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఓ పంతొమ్మిది సంవత్సరాల యువతిని పక్కనే ఉన్న మామిడి తోటలోకి లాక్కొని వెళ్ళాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. ఆపై హత్య చేశాడు. ఈ కేసు గుజరాత్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ యువతి మృతదేహం పక్కన ఉన్న ఒక సంచిని స్వాధీనం చేసుకున్నారు. ఆసంచిలో తాడు, కత్తి ఉండడాన్ని గమనించారు. ఆ తర్వాత చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వేలాది సీసీ కెమెరాలు ఓటేజిని పరిశీలించారు. చివరకు ఉద్వాడ స్టేషన్ లో లభించిన వీడియో ఫుటేజీ పోలీసులకు ఒక ఆధారాన్ని అందించింది. ఆ ఫుటేజ్ లో రాహుల్ కనిపించడంతో.. అతడి ఫోటోలను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. చివరకు అతడిని బాంద్రా – భుజ్ రైల్లో పోలీసులు పట్టుకున్నారు. ఎవరైనా చంపాలనుకొని భావిస్తే.. మరుక్షణమే రైలు ఎక్కుతాడు. ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుంటాడు. వారితో మాటల్లో మాటలు కలిపి దగ్గరవుతాడు. ఆ తర్వాత వారిని మాటల్లో పెట్టి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్తాడు. అక్కడ అత్యాచారం చేసి.. ఆపై హత్య చేస్తాడు. ఇలా ఇప్పటికే వీడి చేతిలో చాలామంది మహిళలు హత్యకు గురయ్యారు..

ఇటీవల కర్నూలు జిల్లా చెందిన రమణమ్మ అనే మహిళ హైదరాబాదులో ఉన్న తన పెద్ద కూతురుని చూడ్డానికి బయలుదేరింది. ఈనెల 23న బెల్గా వి – మణుగూరు రైలు ఎక్కింది. అయితే ఆ మరుసటి రోజు రైలు వద్దకు రమణమ్మ అల్లుడు వెళ్ళాడు.. అయితే రమణమ్మ దివ్యాంగుల కోచ్ లో మరణించినట్టు తెలియడంతో ఒకసారిగా షాక్ కు గురయ్యాడు.. అతడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిసాయి. రైలు ప్రయాణిస్తున్న మార్గంలో యాదగిరి స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి ఆమె గొంతుకు టవల్ చుట్టి చంపినట్టు నిర్ధారించారు. బెంగళూరు స్టేషన్లో రమణమ్మ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్టు గుర్తించారు. పోలీసులు ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలను తనిఖీ చేయగా.. ఫ్లాట్ ఫారం మీద కుంటుకుంటూ నడుస్తున్న రాహుల్ ను గుర్తించారు. అయితే అతడిని గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. రమణమ్మ కేసులో అతడిని తెలంగాణకు తీసుకురావడానికి సికింద్రాబాద్ రైల్వే పోలీసులు ఈనెల 29న గుజరాత్ వెళ్ళనున్నట్టు సమాచారం. ఎదుటివారు ప్రాణాలు కోల్పోతున్నప్పుడు.. గిలగిలా కొట్టుకోవడం రాహుల్ కు అమితానందాన్ని ఇస్తుందట. అందువల్లే అతడు ఇలా వరుస హత్యలకు పాల్పడుతున్నాడని పోలీసులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular