Homeఅంతర్జాతీయంMassachusetts crime : చాట్ జీపీటీలో 'కుటుంబ సభ్యుల హ*త్య'పై సెర్చ్.. అమెరికాలో కన్నతల్లి, తమ్ముడి...

Massachusetts crime : చాట్ జీపీటీలో ‘కుటుంబ సభ్యుల హ*త్య’పై సెర్చ్.. అమెరికాలో కన్నతల్లి, తమ్ముడి దారుణ హ*త్య.. 17 ఏళ్ల కుమారుడి అరెస్ట్

Massachusetts crime : కన్నులముందే ఆడుతూ పాడుతూ తిరిగే పిల్లలు, ఆత్మీయంగా పలకరించే ఇల్లాలు ఉంటే ఆ ఇల్లే ఒక నందనవనం. కానీ ఒక్క రోజులోనే ఆ నందనవనం శ్మశానవాటికగా మారిపోతే? నిన్నటివరకు నవ్వులతో నిండిన ఆ ఇల్లు.. ఈరోజు అంతులేని నిశ్శబ్దంతో, గుండెలు పిండేసే వేదనతో మూగబోయింది. అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రం యాక్టన్‌ పట్టణంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన ప్రతి ఒక్కరి గుండెలను పిండేస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన 45 ఏళ్ల సుధా వెంకటేశన్, […]

Massachusetts crime : కన్నులముందే ఆడుతూ పాడుతూ తిరిగే పిల్లలు, ఆత్మీయంగా పలకరించే ఇల్లాలు ఉంటే ఆ ఇల్లే ఒక నందనవనం. కానీ ఒక్క రోజులోనే ఆ నందనవనం శ్మశానవాటికగా మారిపోతే? నిన్నటివరకు నవ్వులతో నిండిన ఆ ఇల్లు.. ఈరోజు అంతులేని నిశ్శబ్దంతో, గుండెలు పిండేసే వేదనతో మూగబోయింది. అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రం యాక్టన్‌ పట్టణంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన ప్రతి ఒక్కరి గుండెలను పిండేస్తోంది.

ఒకే కుటుంబానికి చెందిన 45 ఏళ్ల సుధా వెంకటేశన్, ఆమె 14 ఏళ్ల చిన్న కుమారుడు సిద్ధార్థ్ అరవింద్ దారుణ హ*త్యకు గురయ్యారు. పనిమీద వేరే చోటకు వెళ్లిన భర్తకు ఈ విషయాన్ని ట్యూషన్ చెప్పే టీచర్ సమాచారం ఇచ్చాడు. ఆ టీచర్ వీరి ఇంటికి రాగా ఎవరూ తలుపులు తీయలేదు. ఈ విషయాన్ని ఆ ఇంటిపెద్దకు తెలియజేయగా.. ఆయన ఇంటికి కాల్ చేశాడు. ఎవరూ లిఫ్ట్ చేయకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో తల్లి, ఆమె కుమారుడు రక్తపు మడుగులో శవాలై కనిపించారు. బేస్‌మెంట్‌లో తల్లి మృతదేహం, మొదటి అంతస్తులో పసివాడైన కుమారుడి మృతదేహం వడిసిపట్టినట్టు పడి ఉన్నాయి. ఒకే ఇంట్లో తల్లీ కొడుకులను అలా నిర్జీవంగా చూసి పోలీసులు వెంటనే ఆ ఇంటి పెద్ద భర్తకు సమాచారం అందించారు.

ఈ దారుణంలో అందరినీ మరింత దిగ్భ్రాంతికి గురిచేసిన అంశం ఏమిటంటే.. ఈ జంట హత్యల కేసులో ఆ కుటుంబానికే చెందిన 17 ఏళ్ల పెద్ద కుమారుడు అరుణ్ అరవింద్ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటుండటం… తోడబుట్టిన తమ్ముడిని, నవమాసాలు మోసి కన్న తల్లిని బలితీసుకునేంత కిరాతకం ఆ మనసులో ఎలా పుట్టిందో ఊహించడానికే భయమేస్తోంది. ఘటన తర్వాత కనుమరుగైన అరుణ్‌ను తల్లి కారులోనే పారిపోతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అంతేకాదు దర్యాప్తులో తేలిన మరో దారుణ నిజం ఏంటంటే.. అరుణ్ ఇంటర్నెట్, చాట్ జీపీటీలలో ‘కుటుంబ సభ్యులను ఎలా హత్య చేయాలి?’ అనే అంశాలపై ముందే శోధనలు చేయడం. ఆన్‌లైన్ డిజిటల్ ప్రపంచం, సాంకేతికత యువత ఆలోచనలను ఎంతటి దారుణమైన మార్గంలోకి నెడుతోందో ఈ ఉదంతం హెచ్చరిస్తోంది.

ఒక వైపు నవమాసాలు మోసి ప్రాణమిచ్చిన తల్లి.. మరోవైపు ఆడుకునే వయసున్న తమ్ముడు అనంత లోకాలకు వెళ్లిపోయారు. ఆ కన్నతండ్రికి మిగిలింది తీరని శోకం.. ఇంకోవైపు జైలు గదిలో కటకటాలు లెక్కపెడుతున్న కన్న కొడుకు. ఒక నిమిషం ఆలోచన, కంటికి కనిపించని డిజిటల్ మాయాజాలం ఒక అప్యాయమైన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేసింది. ఈ విషాదం కేవలం ఆ కుటుంబానికే కాదు, సమాజం మొత్తానికీ కోలుకోలేని గాయాన్ని మిగిల్చింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper