Homeసినిమా వార్తలు'వైష్ణవ్ తేజ్' రెండో సినిమా.. క్రిష్ ఏమైంది ?

‘వైష్ణవ్ తేజ్’ రెండో సినిమా.. క్రిష్ ఏమైంది ?

Krish and Vaishnav Tej
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో, ఇక ఈ హీరో తరువాత సినిమాల పై బయ్యర్లకు ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో ఇప్పుడు అందరి ఆసక్తి ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న వైష్ణవ్ తేజ్ రెండో సినిమా పైన పడింది. గతేడాది సెప్టెంబర్ లోనే క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్, వైష్ణవ్ తేజ్ – రకుల్ జంటగా ఓ సినిమా తీశాడు. ఈ సినిమాకి జంగిల్ బుక్ అని పేరు కూడా పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా విడుదల విషయంలో బయ్యర్లు నిర్మాతలు తొందర పడుతున్నా.. క్రిష్ మాత్రం ఈ సినిమా విడుదలను పట్టించుకోవట్లేదట.

ఎప్పుడో డిసెంబర్ లో షూటింగ్ పూర్తి చేసినా.. ఈ సినిమా ఫస్ట్ కాపీని మాత్రం క్రిష్ బయటకు ఇవ్వడం లేదట. సినిమా అవుట్ ఫుట్ బాగానే వచ్చింది అని, ఇప్పటికే రూమర్స్ వచ్చాయి. అయితే, సినిమాలో ఇలాంటి కమర్షియల్ హంగులు మరియు ఎలాంటి ఆర్భాటాలు ఉండవు అని.. సినిమాలో ఎక్కువ భాగం అడవిలో జరుగుతుందని.. కాబట్టి ప్లే చాల ప్లాట్ గా ఉంటుందని తెలుస్తోంది. అందుకే క్రిష్ ఈ సినిమాని సోల్ రిలీజ్ డేట్ దొరికినప్పుడే రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు.

నిజానికి ‘ఉప్పెన’ సినిమా బిగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన తరువాత, తన సినిమా ప్రచారం చేద్దామనుకున్నాడు క్రిష్. కానీ ప్రస్తుతం వస్తోన్న సినిమాల పోటీలో తన అడవి సినిమా నిలబడటం కష్టం అనుకున్న క్రిష్.. మొత్తానికి తన సినిమా ఊసెత్తడంలేదు. ఇక క్రిష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా ‘హరి హర వీరమల్లు’ సినిమా తీస్తున్నాడు. నిన్న ఈ సినిమాకి సంబంధించిన ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఇక వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా విడుదలయి 50 రోజులు పూర్తి అయింది. ఈ మూవీ ఈ నెల 14న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. వైష్ణవ్ తేజ్ నిన్న తన మూడో సినిమాని కూడా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular