కంగనా రనౌత్ గురించి కొత్త ముచ్చట్లు అక్కర్లేదు, ఆమె ఏంటో సమాజానికి బాగా తెలుసు. అందుకే, ట్విట్టర్ సమాజం కూడా ఇప్పటికే ఆమెను బహిష్కరించింది. మత సామరస్యం దెబ్బతినేలా పోస్టులు పెడుతుంది అంటూ ఆమె పై పెద్ద వేటు పడింది. అలా ఆ వేటులో ఆమె ట్విట్టర్ వేదిక నుంచి బయటకు వచ్చేయాల్సి వచ్చింది. పైగా ట్విట్టర్ మేనేజ్ మెంట్ కంగనా అకౌంట్ ని శాశ్వతంగా సస్పెండ్ చేసింది కూడా.
ట్విట్టర్ దూరం అయ్యాక, కంగనా ఇక చేసేది ఏమి లేక చక్కగా ఇన్ స్టాగ్రామ్ లో కొట్టుమిట్టాడుతూ ఉంది. తన శైలి పోస్టులు అలాగే తనకు మాత్రమే సాధ్యమయ్యే మెసేజ్ లు పెట్టడం మళ్ళీ మొదలెట్టేసింది. అందుకే ఇప్పుడు అక్కడ కూడా కంగనాకి చిన్నపాటి షాక్ తగిలింది. రీసెంట్ గా ఈ బోల్డ్ బ్యూటీకి కరోనా సోకింది. ఆ విషయాన్ని తెలుపుతూ ఇన్ స్టాగ్రామ్ లో ఒక మెసేజ్ పడేసింది.
ఆ మెసేజ్ లో మెయిన్ కంటెంట్ పై పలువురు అభ్యంతరం ప్రకటిస్తూ ట్రోల్ కూడా చేశారు. దాంతో, ఇన్ స్టాగ్రామ్ వారు కూడా కంగనా పెట్టిన ఆ మెసేజ్ ను డిలిట్ చేశారు. కంగనాకి ట్విట్టర్ లో జరిగినట్టే ఇన్ స్టాగ్రామ్ లో కూడా జరిగేలా ఉంది. ఇక్కడ కూడా ఆమెని బహిష్కరిస్తే.. బాలీవుడ్ జనం ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఆ రోజు కూడా దగ్గరలోనే ఉన్నట్లు ఉంది.
ఇంతకీ ఏమిటయ్యా కంగనా పెట్టిన ఆ మెసేజ్ అంటే. “కరోనా ఫ్లూ అనేది చిన్న రోగం. మీడియా ఎక్కువ ప్రచారం చేసి భయపెడుతోంది.’ అని పోస్ట్ పెట్టింది. ఒక పక్క కరోనా కారణంగా రోజుకూ వేలమంది చనిపోతున్నారు. మరోపక్క ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కరోనా కారణంగా ఆల్ రెడీ చనిపోయారు.
ప్రస్తుతం ఇండియా అంతటా కరోనా విలయతాండవం చేస్తోంది. ఆసుపత్రుల్లో బెడ్స్ కూడా దొరకట్లేదు. అన్నిటికి మించి ఆక్సిజన్ లేక జనం పిట్టల్లా రాలిపోతుంటే.. కంగనా సింపుల్ గా చిన్న రోగం అనడం పెద్ద దుమారమే రేపుతోంది.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Kangana twitter account permanently suspended
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com