Homeబిజినెస్2024 Car Launches: కార్‌ లవర్స్‌ కు పండుగ : 2024లో లాంచింగ్‌కు రెడీగా ఏడు...

2024 Car Launches: కార్‌ లవర్స్‌ కు పండుగ : 2024లో లాంచింగ్‌కు రెడీగా ఏడు కొత్తకార్లు.. వాటి విశేషాలివీ

2024 Car Launches: లవర్స్‌ అందరికీ గుడ్‌ న్యూస్‌. నేడు కార్లకు విపరీతంగా డిమాండ్‌ పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీలు తమ లేటెస్ట్‌ కార్లను ఇండియన్‌ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ముఖ్యంగా హోండా, హ్యుందాయ్, కియా, మహీంద్రా, టాటా, మారుతి సుజుకి కంపెనీలు తమ సరికొత్త ఎస్‌యూవీ, హ్యాచ్‌ బ్యాక్, సెడాన్‌ కార్లను 2024లో లాంఛ్‌ చేయడానికి సిద్ధం అవుతున్నాయి.

= హ్యుందాయ్‌ క్రెటా ఫేన్లిఫ్ట్‌ కారును 2024 మార్చిలో లాంఛ్‌ చేసే అవకాశం ఉంది. దీనిలో సరికొత్త 1.5 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ అమర్చారు. ఈ కారు ఇంటీరియర్, ఎక్సె్టరియర్లో పలు మార్పులు చేశారు. ముఖ్యంగా క్యాబిన్లో ఆధునిక సాంకేతికతతో కూడిన సరికొత్త ఫీచర్లు పొందుపరిచారు. అలాగే సెన్సుయస్‌ స్పోర్టినెస్‌ ఫిలాసఫీతో కారు అవుట్‌ లుక్‌ను తీర్చిదిద్దారు.

= కియా కంపెనీ కూడా 2024లో సోనెట్‌ కారును ఇండియాలో లాంఛ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కియా సోనెట్‌ కారు 1.2 లీటర్‌ ఎన్‌ఏ పెట్రోల్, 1.0 లీటర్‌ టర్బో పెట్రోల్, 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్లను కలిగి ఉంటుంది. ఈ నయా కారు ముందు భాగంలో, క్యాబిన్‌లో సరికొత్త మార్పులు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా కాంపాక్ట్‌ ఎస్‌యూవీ కారు సెగ్మెంట్‌ పెరుగుతున్న పోటీకి అనుగుణంగా.. కియా కంపెనీ ఈ కారు లోపలి భాగంలో (ఇంటీరియర్‌) సరికొత్త పరికరాలను, టెక్‌ ఫీచర్లను పొందుపరుస్తోంది.

= మహీంద్రా ఎక్స్‌యూవీ 300 కారును 2024లో లాంఛ్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ కారు డిజైన్ను.. మహీంద్రా ఎక్స్‌యూవీ 700, అప్‌ కమింగ్‌ బీఈ రేంజ్‌ కార్ల డిజైన్ల ప్రేరణతో రూపొందించడం జరిగింది. మహీంద్రా ఎక్స్‌ యూవీ 300 కారు లోపల పెద్ద ఫ్లోటింగ్‌ టచ్‌ ఇన్‌ ఇన్ఫోటైన్మెంట్‌ సిస్టమ్, న్యూ క్లస్టర్‌ అమర్చారు. మొత్తంగా చూసుకుంటే ప్రీమియం క్వాలిటీ సర్ఫేస్‌ మెటీరియల్స్, ట్రిమ్స్‌ రూపొందించిన ఈ కారు లుక్‌ సూపర్‌గా ఉంటుంది.

= ప్రముఖ భారతీయ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ 2024లో టాటా పంచ్‌ ఈవీని లాంఛ్‌ చేసే అవకాశం ఉంది. ఈ కారును జిప్‌ట్రాన్‌ సాంకేతికతతో రూపొందించడం జరిగింది. ఇటీవలే టాటా మోటార్స్‌ నెక్సాన్‌ ఈవీని విడుదల చేసింది. త్వరలోనే పంచ్‌ ఈవీని కూడా లాంఛ్‌ చేయనుంది. వాస్తవానికి ఈ టాటా పంచ్‌ ఈవీలోని ఇంటీరియర్‌.. నెక్సాన్‌ ఈవీతో అనేక సారూప్యతలను కలిగి ఉంటుందని అంచనా. అయితే ఎక్సె్టరియర్‌ విషయంలోనే మాత్రం పూర్తి భిన్నంగా ఉంటుందని సమాచారం.

= ఇక ఇండియన్‌ కార్‌ మేకర్‌ మారుతి సుజుకి 2023 జపాన్‌ మొబిలిటీ షోలో తన సరికొత్త స్విఫ్ట్‌ కారును పరిచయం చేసింది. దీనిని 2024లో లాంఛ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ మారుతి సుజుకి స్విఫ్ట్‌ కారులో న్యూ జెడ్‌ సిరీస్‌ మైల్డ్‌ హైబ్రీడ్‌ త్రీ సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ అమర్చారని.. ఇది ఎంటీ లేద సీవీటీ అనుసంధానం కలిగి ఉందని సమాచారం. మారుతి సుజుకి కంపెనీ ఈ స్విఫ్ట్‌ కారు ఎక్సె్టటీరియర్, ఇంటీరియర్‌ డిజైన్‌లో అనేక మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

= హోండా కంపెనీ 2018లో హోండా అమేజ్‌ కారును లాంఛ్‌ చేసింది. 2021లో మిడ్‌–లైఫ్‌ ఫేస్లిఫ్టు్క అప్‌ గ్రేడ్‌ అయ్యింది. అయితే థర్డ్‌ జనరేషన్‌ కాంపాక్డ్‌ సెడాన్‌ 2024లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ హోండా అమేజ్‌ కారులో 1.2 లీటర్‌ ఐ–వీటెక్‌ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 90 పీహెచ్‌పీ పవర్, 110 ఎన్‌ఎం టార్క్‌ జనరేట్‌ చేస్తుంది. అయితే ఇండియన్‌ మార్కెట్‌ డీజిల్‌ ఇంజిన్‌ కారు మాత్రం అందుబాటులో ఉండదు.

= భారత్లో 2030 లోపు 5 ఎస్యూవీ కార్లను లాంఛ్‌ చేయాలని హోండా కంపెనీ ఒక లక్ష్యం పెట్టుకుంది. అందులో భాగంగా 2024లో హోండా న్యూ కాంపాక్ట్‌ ఎస్యూవీని లాంఛ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ జపాన్‌ ఆటోమొబైల్‌ కంపెనీ ఇటీవలే హోండా ఎలివేట్‌ కారును విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో నాలుగు ఎస్‌యూవీలు లైన్‌లో ఉన్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular