Homeబిజినెస్GST Rates: సామాన్యులకు ఊరట.. జీఎస్టీ తగ్గింపు.. భారీగా ధరలు తగ్గేవి ఇవే

GST Rates: సామాన్యులకు ఊరట.. జీఎస్టీ తగ్గింపు.. భారీగా ధరలు తగ్గేవి ఇవే

GST Rates: జీఎస్టీ రేటు హేతుబద్ధీకరణపై మంత్రుల బృందం (GoM) కొన్ని వస్తువులపై GSTని తగ్గించాలని నిర్ణయించింది. వీటిలో 20-లీటర్ల ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిళ్లు, సైకిళ్లు, నోట్‌బుక్‌లు ఉన్నాయి. అదే సమయంలో చేతి గడియారాలు, బూట్లపై కూడా జీఎస్టీని పెంచినట్లు ఓ అధికారి తెలిపారు. బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని మంత్రుల బృందం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దాదాపు రూ. 22,000 కోట్లు అని అధికారులు తెలిపారు. ముఖ్యంగా 20 లీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌పై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించింది. జీఎస్టీ పై ఏర్పాటైన మంత్రుల బృందం (GOM) చాలా చోట్ల పన్ను రేట్లలో మార్పులను సిఫార్సు చేసింది. ఈ అంశాలన్నింటిపై వచ్చే నెలలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయాలు తీసుకోవచ్చు. సైకిళ్లపై కూడా పన్ను తొలగించవచ్చు. అంతేకాకుండా ఖరీదైన షూలు, వాచీలపై కూడా పన్ను పెంచాలని సిఫారసు చేసింది. అంతే కాకుండా సిన్ టాక్స్ (( సప్చ్యురీ టాక్స్ లేదా వైస్ టాక్స్ అని కూడా పిలుస్తారు) అనేది మద్యం , పొగాకు , డ్రగ్స్, క్యాండీలు , శీతల పానీయాలు , ఫాస్ట్ ఫుడ్స్ , కాఫీ , షుగర్ వంటి సమాజానికి మరియు వ్యక్తులకు హానికరంగా భావించే కొన్ని వస్తువులపై ప్రత్యేకంగా విధించే ఎక్సైజ్ పన్ను)) పెంపుపై కూడా నిర్ణయం తీసుకోవచ్చు. దీని సాయంతో ప్రభుత్వానికి రూ.22 వేల కోట్ల అదనపు ఆదాయం రానుంది.

బూట్లు, గడియారాలు కాస్ట్లీ, సైకిళ్లు చౌక
చాలా చోట్ల పన్నులు పెంచడానికి, తగ్గించడానికి మంత్రుల బృందం సిఫార్సులు చేసింది. అన్ని సిఫార్సులను ఆమోదించినట్లయితే.. రూ. 25,000 కంటే ఎక్కువ ఖరీదు చేసే రిస్ట్ వాచీలపై జీఎస్టీ 18 శాతం నుంచి 28 శాతానికి పెరగవచ్చు. ఇది కాకుండా రూ.15,000 కంటే ఎక్కువ ధర ఉన్న షూస్‌పై జీఎస్టీ కూడా 18 శాతం నుంచి 28 శాతానికి పెరగవచ్చు. 10,000 రూపాయల కంటే తక్కువ ధర కలిగిన సైకిళ్లు కూడా ఇప్పుడు 12 శాతానికి బదులుగా 5 శాతం GST పరిధిలోకి వస్తాయి. 20 లీటర్ల కంటే పెద్ద బాటిల్ వాటర్ బాటిల్స్ కూడా 18 శాతానికి బదులుగా 5 శాతం జీఎస్టీ శ్లాబ్‌లోకి వెళ్లవచ్చు. పుస్తకాలపై జీఎస్టీని కూడా 12 నుంచి 5 శాతానికి తగ్గించవచ్చు.

పాపపు పన్ను పెంచాలని సిఫార్సు
మంత్రుల బృందం సిన్ ట్యాక్స్‌ను పెంచాలని సిఫార్సు చేసింది. అలాంటి వస్తువులను 18 నుంచి 28 శాతం వరకు తీసుకోవాలని కోరారు. సిన్ గూడ్స్‌లో ఆల్కహాల్, పొగాకు, సిగరెట్‌లు ఉంటాయి. విలాసవంతమైన వస్తువులపై పన్నును పెంచడం ద్వారా ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సామాన్యులు ఉపయోగించే వస్తువులపై కూడా పన్నులు తగ్గించాలని కోరుతున్నారు. ఇది కాకుండా, ఆరోగ్య బీమా, జీవిత బీమా నుండి GSTని తొలగించాలని కూడా సిఫార్సులు చేయబడ్డాయి. ఈ విషయంలో జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోనుంది. జీఎస్టీ కౌన్సిల్ గత నెలలో జరిగిన సమావేశంలో 13 మంది మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది.

 

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular