Tata Motors pan India bus orders: జాతీయ మోటార్ సంస్థ టాటా.. కార్లతయారీలో కొత్త కొత్త మోడళ్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. 2026 ఏడాది మొదట్లోనే అన్నింటికన్నా ముందు కొత్త వేరియంట్ను మార్కెట్లోకి విడుదల చేసి పోటీలో ఫస్ట్ నిలిచింది. తాజాగా
టాటా మోటార్స్ దేశవ్యాప్తంగా 5 వేలకుపైఆ బస్సుల ఆర్డర్లు సాధించింది. రాష్ట్ర రవాణా సంస్థల నుంచి వచ్చిన ఈ ఒప్పందాలు కంపెనీ ఆధిపత్యాన్ని మరింత బలపరుస్తున్నాయి.
పలు రాష్ట్రాల నుంచి భారీ ఆర్డర్లు..
భారతదేశ మొదటి వాణిజ్య వాహన తయారీదారు టాటా మోటార్స్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తెలంగాణ, బిహార్, రాజస్థాన్, కేరళ, హర్యానా, చండీగఢ్లోని రవాణా సంస్థల నుంచి 5 వేలకుపైగా బస్సుల, షాసీల ఆర్డర్లు దక్కించుకుంది. ప్రభుత్వ ఈ–బిడ్డింగ్ ద్వారా సాధించిన ఈ ఒప్పందాలు రాష్ట్రాలతో సమయానుగుణంగా అమలవుతాయి.
అన్ని రూట్లకు సరిపోయేలా..
మాగ్నా, సిటీరైడ్, స్టార్బస్, స్టార్బస్ ప్రైమ్ వంటి పూర్తి బస్సులు, ఎల్పీవో 1,618, 1,622, 1,822 షాసీలు ఈ ఆర్డర్లో భాగం. నగరాలు, అంతరనగరాలు, లాంగ్ జర్నీ కోసం రూపొందించినవి ఇవి, భద్రత, సౌకర్యం, ఇంధన సామర్థ్యంతో పనిచేస్తాయి.
ముందంజలో టాటా
టాటా కమర్షియల్ ప్యాసింజర్ వెహికల్ వ్యవస్థాపకుడు ఆనంద్ ఎస్, విభిన్న భూముల్లో సేవలు అందించేందుకు కంపెనీ డిజైన్లపై ఎస్టీయూలు నమ్మకం చూపాయని పేర్కొన్నాడు. సంపూర్ణ సేవ 2.0 ప్రోగ్రామ్తో రక్షణాత్మక చర్యలు, పునరుద్ధరణ, స్పేర్ పార్ట్స్ అందిస్తుంది.
ఈ ఆర్డర్లు పెరిగే రవాణా అవసరాలకు సమాధానం. 9 నుంచి 55 సీట్ల వరకు విస్తరించిన పోర్ట్ఫోలియోతో టాటా పోటీదారులను మించి, ఎలక్ట్రిక్ బస్సుల వైపు మళ్లింది. దీర్ఘకాలంలో ఉద్గారాలు తగ్గి, స్థిరమైన మార్కెట్ పొజిషన్ను బలపరుస్తుంది.
