తెలంగాణ బస్సలను రాష్ట్ర సరిహద్దుల్లోనే ఆపాలని ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులపై తెలంగాణతో ఇంకా ఒప్పందం కుదరనందువల్ల ఇది సాధ్యం కాలేదన్నారు. అయితే రాష్ట్ర సరిహద్దుల్లో ఏపీ బస్సలను అందుబాటులో ఉంచుతామని ఇందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆంధ్ర సరిహద్దు వరకే బస్సులను నడపాలని టీఎస్ఆర్టీసీని ఆయన కోరారు. దసరా సెలవుల్లో ఒప్పందం కుదరడం ఆలస్యమైందని, తొందర్లో ఈ సమస్యపై పరిష్కారం కనుగొంటామని మంత్రి తెలిపారు.