cinema
ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్లు ప్రారంభయ్యే అవకాశం కనిపించడం లేదు. గురువారం నుంచి రాష్ట్రంలో థియేటర్లు ప్రారంభించే నేపథ్యంలో బుధవారం 13 జిల్లాల ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. సమావేశం అనంతరం వారు మాట్లాడుతూ థియేర్లు తెలవాలంటే ఒక్కో దానికి రూ.10 లక్షల అదనపు ఖర్చు అవుతుందని, 50 శాతం సీట్లతో థియేటర్లకు ఆదాయం రాదని తెలిపారు. ఈమేరకు ఫిక్స్డ్ విద్యుత్ చార్జిలు ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కాగా.. ఫుల్ సీట్కు అనుమతి వచ్చినప్పుడే థియేటర్లు ప్రారంభిస్తామని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అన్లాక్ గౌడ్లైన్స్లో భాగంగా 50 శాతం సీట్లతో సినిమా థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని రాష్ట్రప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే..