ఇళ్ల పట్టాల్లో అవినీతి జరిగిందని అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాసరావు మండిపడ్డారు. మంత్రి మీడియాతో మాట్లాడారు. దొంగ ఓట్లతో వెలగపూడి గెలిచారు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. రామకృష్ణబాబు ఖబడ్దార్. సీఎం జగన్మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డిని ఏక వచనంతో పిలుస్తావా? మీ రొయ్య మీసాలతో భయపెట్ట లేరు. విశాఖ ప్రజలు ఓట్లు, సీట్లు కావాలి. పరిపాలన రాజధాని మాత్రం చంద్రబాబుకు అవసరం లేదు. ప్రభుత్వ భూముల్లోనే విశాఖ పరిపాలన రాజధాని నిర్మాణం జరుగుతుంది’ అని మంత్రి స్పష్టం చేశారు.