ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కు రాష్ట్రప్రభుత్వం షాక్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్ బుధవారం అన్ని జిల్లాల యంత్రాంగంతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి ఎన్నికల కమిషనర్ లేఖ రాశారు. అయితే ఈ లేఖపై నీలం సాహ్ని స్పందించారు. ప్రస్తుతం గ్రామాల్లో ఇంకా కరోనా వైరస్ తొలగిపోనందున పోలీసులు కరోనాను అదుపుచేసే విధుల్లో నిమగ్నమయ్యారన్నారు. అందువల్ల వీడియో కాన్పరెన్ష్ అవసరం లేదని సాహ్ని బదులిచ్చారు. దీంతో నిమ్మగడ్డ ఎలా స్పందిస్తారో చూడాలి.