గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్ పురం శెట్టి అంకులు ను గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి చంపేశారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. కాగా ఇటవల కడప జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్య ఘటన మరువకముందే ఈ సంఘటన జరగడం టీడీపీలో కలకలం రేపుతోంది.