rain in telanganan
బంగాళాఖాతంలో ఈనెల 19న మరో అల్పపీడనం ఏర్పడనుందని విశాఖపట్నం వాతావరణశాఖ హెచ్చరించింది. ఇప్పటికే తెలంగాణలోని హైదరాబాద్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లోనూ 19 నుంచి 21వ తేదీ వరకు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ శాఖ అధికారులు సూచిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో రాయలసీమలోని కారంచేడు, బొండపల్లిలో 8 సెంటిమీటర్ల వర్షం కురిసింది.