spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Visakhapatnam News: విశాఖలో వైసీపీకి ఎప్పుడూ కష్టమే!

Visakhapatnam News: విశాఖలో వైసీపీకి ఎప్పుడూ కష్టమే!

Visakhapatnam News: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఎన్నెన్నో విజయాలను చూసింది. 2019లో అయితే కనివిని ఎరుగని విజయంతో దేశం మొత్తం తన వైపు చూసుకునేలా చేసింది. అయితే అదే పరిస్థితి 2024లో కూడా ఎదురయింది. కానీ అది అపజయం రూపంలో. అయితే జయాపజయాలు సహజం కానీ.. కొన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపలేకపోయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. వైసిపి ఆవిర్భవించి శ్రీకాకుళం, గుంటూరు, విజయవాడ పార్లమెంటు స్థానాల్లో పట్టు సాధించలేకపోయింది. అదే సమయంలో విశాఖ నగరంలో పార్టీని విజయ తీరాల వైపు నడిపించలేకపోయింది. అయితే ఇప్పటికీ విశాఖలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీది అదే పరిస్థితి. ఇప్పుడు అక్కడ పార్టీని నడిపించే పెద్ద నాయకుడు ఎవరూ లేకపోవడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నిజమైన లోటు. పార్టీని నడిపించేందుకు పక్క జిల్లాకు చెందిన బొత్సను తీసుకొచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

జిల్లా నేతల పాత్ర కీలకం..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సమయంలో విశాఖ జిల్లా( Visakha district ) నేతల పాత్ర కీలకం. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రకటన సమయంలో ఆయన వెంట ఉండే వారు సబ్బం హరి. అటు తరువాత కొణతాల రామకృష్ణ, టిడిపిలో సీనియర్ నేతగా చలామణి అయిన దాడి వీరభద్రరావు ఇలా అందరూ క్యూ కట్టారు. అటు తరువాత చాలామంది నేతలు జగన్ గూటికి చేరారు. అయితే జగన్మోహన్ రెడ్డి దురదృష్టమో.. లేకుంటే విశాఖ సెంటిమెంట్ చెప్పలేం కానీ ఒక్కరంటే ఒక్క పెద్ద వైసీపీ నేత ఆ పార్టీలో ఇమడలేకపోయారు. ఒక్కొక్కరు పార్టీకి గుడ్ బై చెప్పారు. కొందరు ఎన్నికల ముందు గుడ్ బై చెప్పగా.. మరికొందరు ఎన్నికల ఫలితాలు వచ్చాక పార్టీకి టాటా చెప్పారు. ఇప్పటికీ అక్కడ పార్టీ పుంజుకోలేకపోతోంది. నడిపించే సరైన నాయకుడు లేక చతికిలపడుతోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.

నియోజకవర్గ నేతలు సైతం..
2024 ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు తో( Avanti shrinivasa Rao ) పాటు ఓ పదిమంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. చివరకు నియోజకవర్గాల బాధ్యతలు చూసేవారు సైతం కరువయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో జిల్లాలో పార్టీని గాడిలో పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి పడరాని కష్టాలు పడాల్సి వచ్చింది. అందుకే భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలను విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు అప్పగించారు. మరోవైపు విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవి ఇచ్చి జిల్లా బాధ్యతలు కట్టబెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే విశాఖకు ఇప్పుడు బొత్స దిక్కయ్యారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖ పట్టు చిక్కలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎదురీదుతోంది. ఇలా ఎలా చూసుకున్నా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి విశాఖలో కష్ట కాలమే.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper