Homeఆంధ్రప్రదేశ్‌TDP Hybrid Mahanadu: జాతీయస్థాయిలో ఓ రేంజ్ లో టిడిపి హైబ్రిడ్ మహానాడు!

TDP Hybrid Mahanadu: జాతీయస్థాయిలో ఓ రేంజ్ లో టిడిపి హైబ్రిడ్ మహానాడు!

TDP Hybrid Mahanadu: తెలుగుదేశం పార్టీ మరోసారి తన సత్తా చాటుకుంది. మిగతా ప్రాంతీయ పార్టీలకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రాంతీయ ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు ఏర్పాటు అవుతుంటాయి. అందులో కొన్ని మాత్రమే సక్సెస్ అవుతాయి. ఇటువంటి సక్సెస్ పార్టీల్లో తెలుగుదేశం ఒకటి. ఆ పార్టీకి విజయాలు కొత్త కావు. అపజయాలు కొత్త కావు. సంక్షోభాలు కొత్త కావు. ఎలాంటి పరిస్థితినైనా తట్టుకొని నిలబడగలిగిన పార్టీ తెలుగుదేశం. అయితే నిన్ననే ఒక సక్సెస్ సాధించింది. పశ్చిమ ఆసియా ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థ పై పడుతున్న తరుణంలో.. పొదుపు పాటించాలన్న ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుతో.. భౌతిక మహానాడు ను రద్దు చేశారు చంద్రబాబు. హైబ్రిడ్ విధానంలో ఏర్పాటు చేశారు. అయితే చెప్పేందుకు కాస్త వెరైటీగా ఉన్నా.. అది సాధ్యమేనా? అనే ప్రశ్న ఉత్పన్నం అయ్యింది. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు. క్రమశిక్షణతో హైబ్రిడ్ మహానాడు ను విజయవంతంగా పూర్తి చేశారు తొలిరోజు. రెండో రోజు కూడా ఉత్సాహ భరిత వాతావరణంలో కొనసాగుతోంది మహానాడు. దేశంలో మిగతా ప్రాంతీయ పార్టీలు సైతం తెలుగుదేశం పార్టీని అభినందించక తప్పదు.

* గతానికి భిన్నం..
పార్టీ కేంద్ర కార్యాలయంలో పరిమిత సంఖ్యలో ప్రతినిధులు హాజరయ్యారు. అది కూడా గతానికంటే భిన్నం. యువతతో పాటు మహిళలకు ప్రాధాన్యమిచ్చి.. వారిని వక్తల జాబితాలో చేర్పించి మాట్లాడించిన తీరు మాత్రం అభినందనీయం. మహానాడు ను చూస్తుంటే.. అక్కడి నాయకుల ప్రోత్సాహాన్ని చూస్తుంటే.. మరో నాలుగు దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీకి నాయకత్వం లోటు లేనట్టే. అంతలా ప్రభావం చూపింది మహానాడు. ఎన్నో అనుమానాలను పటాపంచలు చేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా 1800 క్లస్టర్లకు పైగా ఏర్పాటు చేసి.. లక్షలాదిమంది కార్యకర్తలతో మమేకమై మహానాడు నడిపించిన తీరు మాత్రం అద్భుతమే.

* ఆ ప్రత్యేక ప్రకటనతో..
ఈ హైబ్రిడ్ మహానాడులో మరో ప్రత్యేకత ఉంది. అదే మహిళలకు 33% రిజర్వేషన్ల ప్రకటన. మహానాడు అంతా ఒక ఎత్తు.. ఆ ప్రకటన మరో ఎత్తు అన్నట్టు ఉంది. పార్లమెంటులో బిల్లుతో సంబంధం లేకుండా.. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో 33 శాతం మంది మహిళలకు టికెట్లు ఇస్తామని లోకేష్ చేసిన ప్రకటన మహిళా లోకాన్ని ఆకట్టుకుంది. మహిళా ధీమ్ తో సాగిన ఈ మహానాడు.. అదే తీరుతో కొనసాగింది. తెలుగుదేశం పార్టీ ఇక మహిళలదే అన్నట్టు పరిస్థితి ఉంది. యువతకు సైతం ప్రాధాన్యం ఇచ్చారు. మహానాడులో హాజరైన ప్రతి ఒక్కరు నాలుగు పదుల వయసులోని వారు కావడం గుర్తించాల్సిన అంశం. టిడిపి నాయకత్వం ఏ ఆలోచనతో ఈ హైబ్రిడ్ మహానాడు ను ఏర్పాటు చేసిందో.. ఆ టార్గెట్ ను చాలా సులువుగా అందుకుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
CM Vijay Pregnant Woman Honor

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...
Weight Loss

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
Oktelugu Epaper