spot_img
Homeఆంధ్రప్రదేశ్‌RK Kotha Paluku: జగన్ ప్రస్తావన వస్తే చాలు రాధాకృష్ణ ఊరుకోడు

RK Kotha Paluku: జగన్ ప్రస్తావన వస్తే చాలు రాధాకృష్ణ ఊరుకోడు

RK Kotha Paluku: జగన్మోహన్ రెడ్డికి, చంద్ర బాబు నాయుడు కు రాజకీయంగా వైరం. అంతకుముందు చంద్రబాబుకు, వైయస్ రాజశేఖర్ రెడ్డి కి రాజకీయ వైరం ఉండేది. రాజశేఖర్ రెడ్డి కన్నుమూసిన తర్వాత.. ఆయన వారసుడిగా జగన్ రాజకీయాల్లోకి వచ్చారు. చంద్రబాబు నాయుడుతో ఢీకొంటున్నారు. ఒక రకంగా చంద్రబాబు నాయుడుకు సరైన ప్రత్యర్థిగా జగన్ ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

వాస్తవానికి రాజకీయ నాయకులతో మీడియా ఆధిపతులు వైరం పెట్టుకోవడం మనదేశంలో ఇదే తొలిసారి కాదు. కాకపోతే నువ్వా నేనా అన్నట్టుగా వ్యవహరించడమే అసలైన వైచిత్రి. జగన్ అంటే చాలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల అధిపతులు మండి పడుతుంటారు. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ అయితే జగన్ మీద ఒంటి కాలు మీద లేస్తుంటాడు. వాస్తవానికి జగన్, రాధాకృష్ణ మధ్య గెట్టు పంచాయితీలు లేవు. ఇద్దరు కలిసి రాజకీయాలలో పోటీ చేయలేదు.. కనీసం ఇద్దరి మధ్య ఆస్తి వివాదాలు కూడా లేవు. కానీ చంద్రబాబు కంటే ఎక్కువ జగన్ మీద కోపం చూపిస్తుంటాడు రాధాకృష్ణ.

తన పత్రిక ఆంధ్రజ్యోతిలో జగన్ మీద కొన్ని లక్షల కథనాలను వ్యతిరేకంగా రాయించి ఉంటాడు. ఇప్పటికీ అదే ధోరణి కొనసాగిస్తున్నాడు. చివరికి తన పేరు మీద ప్రతి ఆదివారం రాసే కొత్త పలుకులో కూడా రాధాకృష్ణ జగన్ మీద మండిపడుతూనే ఉంటాడు. తాజాగా కూడా రాధాకృష్ణ జగన్ మీద బీభత్సంగా రాసేశాడు. తను రాసే కొత్త పలుకులో జగన్మోహన్ రెడ్డిని తూర్పార పట్టాడు. జగన్ తప్పు చేశాడని.. జగన్ వల్లే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ ఘోరాలు జరుగుతున్నాయని.. గతంలో అతడు అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలు వ్యవహారాలు జరిగాయని ఏకంగా ఒక దర్యాప్తు సంస్థకు మించి లోతైన విచారణ సాగించాడు రాధాకృష్ణ. అంతేకాదు స్కిల్ వ్యవహారాన్ని చంద్రబాబు మీద పెట్టిన దురుద్దేశమైన కేసు అని తీర్మానించాడు రాధాకృష్ణ.

వాస్తవానికి ఒక కేసులో విషయాలను దర్యాప్తు సంస్థలు బయటపెడుతుంటాయి. మీడియా ఆ విషయాలను వార్తల రూపంలో ప్రజలకు తెలియజేయాలి. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ జర్నలిజం కనుక ఆ మీడియా యాజమాన్యం కొనసాగిస్తే అందులో ఉన్న విషయాలను పట్టిష్టమైన ఆధారాలతో బయటపెట్టాలి. అంతేతప్ప గాలికి కొట్టుకుపోయే పేలపిండి మాదిరిగా వార్తలను రాయకూడదు. పరకామణి చోరీ, లడ్డులో కల్తీ నెయ్యి.. ఇలా ప్రతి విషయంలోనూ రాధాకృష్ణ దర్యాప్తు సంస్థ మాదిరిగా జగన్ మీద అడ్డంగా రాసేశాడు. ఇన్ని విషయాలు రాధాకృష్ణ చెప్పిన తర్వాత.. కూటమి ప్రభుత్వం జగన్ ను జైల్లో వేయకుండా ఎందుకు వెనుకాడుతున్నట్టు?!

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper