Homeఆంధ్రప్రదేశ్‌Jagan Telangana Tapping Plot: తెలంగాణ నుంచి జగన్ కు ప్రమాదం!

Jagan Telangana Tapping Plot: తెలంగాణ నుంచి జగన్ కు ప్రమాదం!

Jagan Telangana Tapping Plot: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) నేతలు కేసుల్లో చిక్కుకొని విలవిలలాడుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతిని బయటకు తీస్తోంది. ఇప్పటికే మద్యం కుంభకోణంలో కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. మరికొందరు అరెస్ట్ అవుతారని ప్రచారం సాగుతోంది. వల్లభనేని వంశీ మోహన్ రిమాండ్ లో ఉన్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సైతం జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మరోవైపు కోల్ కత్తా విమానాశ్రయంలో మాజీ మంత్రి కొడాలి నానిని పోలీసుల అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఈ వరుస పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలేలా ఉంది. తెలంగాణలో పోన్ ట్యాపింగు బాధితులు ఏపీకి చెందిన నేతలు కావడంతో జగన్ సర్కార్ హస్తంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల, ప్రస్తుత సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఫోన్లు అప్పట్లో ట్యాపింగ్ కు గురైనట్లు తాజా విచారణలో తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డికి రాజకీయ లబ్ధి చేకూర్చేందుకు అప్పటి తెలంగాణ సర్కార్ ఈ ఫోను ట్యాపింగుకు పాల్పడినట్లు అనుమానాలు ఉన్నాయి.

Also Read: Phone Tapping Case: చంద్రబాబు, లోకేష్ ఫోన్లు కూడా ట్యాప్ చేశారా?

షర్మిల విషయంలో అలా..
వైయస్ షర్మిల( Y.S Sharmila ) తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేశారు. అప్పట్లో కెసిఆర్ అధికారంలో ఉండేవారు. జగన్మోహన్ రెడ్డికి ఆయన అత్యంత స్నేహితుడు కూడా. దీంతో కెసిఆర్ కు వ్యతిరేకంగా షర్మిల తెలంగాణలో పార్టీని పెట్టడాన్ని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారు. మరోవైపు కుటుంబ విభేదాలు తలెత్తిన నేపథ్యంలో తనకు వ్యతిరేకంగా షర్మిల గళం ఎత్తుతారని జగన్మోహన్ రెడ్డి భావించారు. అయితే షర్మిల ఒకానొక దశలో జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే మీడియాతో ఎక్కువగా టచ్లోకి వెళ్లారు. ఆమె ఏపీ రాజకీయాల వైపు వస్తున్నారని తెలిసి జగన్ జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా షర్మిల ఫోన్ ట్యాప్ చేసినట్లు తాజాగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తెలంగాణలో కాంగ్రెస్( Congress) అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు తెరపైకి వచ్చింది. అప్పట్లో కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ సర్కార్ రాజకీయ ప్రత్యర్థుల సమాచారాన్ని తెలుసుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి బాధిత వర్గాలుగా కాంగ్రెస్, బిజెపి, టిడిపి నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా అప్పటి కీలక అధికారిని ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపడుతోంది. ఈ క్రమంలో ఏపీలో జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా లబ్ధి చేకూర్చేందుకు చంద్రబాబుతో పాటు లోకేష్ ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు సదరు అధికారి విచారణలో వెల్లడించినట్లు ప్రచారం నడుస్తోంది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కోరిక మేరకు తెలంగాణ సర్కార్ ఇదంతా చేయించిందని తాజాగా విచారణలో వెలుగు చూడడం సంచలనంగా మారింది.

Also Read: Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ లో కొత్తకోణం.. ఆ అధికారుల ఫోన్ల పై కూడా నిఘా పెట్టిన నాటి ప్రభుత్వ పెద్దలు..

తీవ్రమైన నేరం..
అయితే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి పై( Y S Jagan Mohan Reddy ) నమోదైన అవినీతి కేసులు కంటే.. ఫోన్ ట్యాపింగ్ కేసులు తీవ్రమైనవి. ఈ విషయంలో కెసిఆర్ తో పాటు జగన్మోహన్ రెడ్డి పై సైతం ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తోంది. నిజంగా ఫోన్ ట్యాపింగు అనేది తీవ్రమైన నేరము. గతంలో చాలా ప్రభుత్వాలతో పాటు నేతలు దీనికి మూల్యం చెల్లించుకున్నారు. తప్పకుండా ఈ ఇద్దరి నేతలపై గట్టిగానే ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్న కేసులు చాలావు అన్నట్టు.. ఫోన్ ట్యాపింగ్ కేసు మెడకు చుట్టుకోవడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కలిగిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular