Homeఆంధ్రప్రదేశ్‌YS Sharmila - Chandrababu : షర్మిల కోసం చంద్రబాబు మహా త్యాగం

YS Sharmila – Chandrababu : షర్మిల కోసం చంద్రబాబు మహా త్యాగం

YS Sharmila – Chandrababu : కడప పార్లమెంటు స్థానం నుంచి జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో అవినాష్ రెడ్డి ఈ స్థానం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. అయితే ఈసారి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వాలని చంద్రబాబు భావించారు. కడప పార్లమెంటు స్థానంలో బలమైన అభ్యర్థిని నిలబెట్టి అవినాష్ రెడ్డిని నిలువరించి.. తద్వారా జగన్ కు కోలుకోలేని షాక్ ఇవ్వాలని చంద్రబాబు అనుకున్నారు. బలమైన అభ్యర్థి కోసం తీవ్రంగా కసరత్తు చేశారు. ఎన్నో వడపోతల తర్వాత చివరికి టిడిపి జమ్మలమడుగు ఇన్చార్జి భూపేష్ రెడ్డిని ప్రకటించారు. భూపేష్ రెడ్డి ఎన్ని ప్రకటిస్తున్నట్టు చివరి వరకు చెప్పలేదని ప్రచారం జరుగుతోంది.

భూపేష్ రెడ్డి పేరు ప్రకటించడం పట్ల ఆయన వర్గీయులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్చార్జిగా ఆయన ఇన్ని రోజులపాటు పనిచేశారు. జమ్మలమడుగు నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఉన్నారు. అధికార పార్టీ ఎన్ని కేసులు పెట్టిన టిడిపి కార్యకర్తలను రక్షించుకుంటూ వస్తున్నారు. కూటమి పొత్తుల నేపథ్యంలో తన కొడుకును ఎమ్మెల్యేను చేయాలని భావించారు. మరీ ముఖ్యంగా గత మూడు సంవత్సరాలలో టిడిపిని జమ్మలమడుగు స్థానంలో బలోపేతం చేశారు. అనూహ్యంగా ఆస్థానాన్ని బిజెపికి కేటాయించడంతో.. ఒకసారి గా భూపేష్ రెడ్డి నిర్వేదంలో మునిగిపోయారు. ఆ స్థానాన్ని బిజెపి అభ్యర్థి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి కేటాయించారు. ఆదినారాయణ రెడ్డికి సీటు వెళ్లిపోవడంతో భూపేష్ రెడ్డి ఒకింత కోపంతోనే ఉన్నారు. భూపేష్ రెడ్డి కోపం టిడిపికి మంచిది కాదని భావించిన చంద్రబాబు.. ఆయనకు ఏదో ఒకటి ఇవ్వాలని భావించి కడప ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు.. భూపేష్ రెడ్డి రాజకీయ జీవితాన్ని బలి పెట్టడానికే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన వర్గీయులు అంటున్నారు. ఒకవేళ లోకేష్ కు కూడా ఇలాంటి పరిస్థితే వస్తే చంద్రబాబు ఇటువంటి నిర్ణయమే తీసుకుంటారా అని భూపేష్ రెడ్డి అనుషరులు ప్రశ్నిస్తున్నారు.

ఇక జమ్మలమడుగు స్థానంలో సీటు దక్కించుకున్న ఆదినారాయణ రెడ్డి.. తన అన్న కుమారుడి రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆదినారాయణ రెడ్డికి ఆ స్థాయిలో ప్రజాబలం ఉంటే కడప పార్లమెంటు స్థానానికి పోటీ చేయవచ్చు కదా అని భూపేష్ రెడ్డి అభిమానులు నిలదీస్తున్నారు. మరోవైపు కడప ఎంపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి పేరును ప్రకటించగానే అక్కడి తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరుత్సాహానికి గురయ్యాయి. మొదటినుంచి జగన్ ను కట్టడి చేస్తామని చంద్రబాబు చెప్తున్నప్పటికీ.. ఆయన మాట విని ఎవరూ ముందుకు రాలేదు. తాజా పరిణామాలు అవే చెబుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

కడప పార్లమెంట్ స్థానానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలకు అవకాశం ఇవ్వడం.. ఈ విషయం ముందే తెలియడంతో చంద్రబాబు భూపేష్ రెడ్డిని అభ్యర్థిగా నియమించారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఒకేసారి అటు కాంగ్రెస్, ఇటు బిజెపితో ప్రయాణం సాగిస్తున్నారని.. భూపేష్ రెడ్డి వర్గీయులు అంటున్నారు. షర్మిల కోసం, ఆదినారాయణ రెడ్డి కోసం భూపేష్ రెడ్డి రాజకీయ భవితవ్యాన్ని బలిపెట్టారని వారు విమర్శిస్తున్నారు.. మరి భూపేష్ రెడ్డి కడపలో నెగ్గుతారా? అటు అవినాష్ రెడ్డి, ఇటు షర్మిల పోటీ పడితే.. మధ్యలో ఆయన గెలుస్తారా? కాలం గడిస్తే తప్ప ఈ ప్రశ్నలకు సమాధానం లభించదు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular