Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu fixes Galla Jayadev: గల్లా జయదేవ్ కు అలా ఫిక్స్ చేసిన చంద్రబాబు!

Chandrababu fixes Galla Jayadev: గల్లా జయదేవ్ కు అలా ఫిక్స్ చేసిన చంద్రబాబు!

Chandrababu fixes Galla Jayadev: గల్లా జయదేవ్( Galla Jaidev ).. పరిచయం అక్కర్లేని పేరు. పారిశ్రామిక, రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. అమర్ రాజా కంపెనీ యజమాని. అయితే గత కొద్ది రోజులుగా గల్లా జయదేవ్ కనిపించటం లేదు. గతం మాదిరిగా మీడియా ముందుకు కూడా రావడం లేదు. మొన్న ఆ మధ్యన తనకు రాజ్యసభ పదవి చేయాలని ఉందని.. తెలుగుదేశం పార్టీ ద్వారా వస్తే సంతోషిస్తానని చెప్పారు. ఓ ఆలయ సందర్శనకు వెళ్తూ అవసరం అనుకుంటే మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. అయితే గల్లా జయదేవ్ విషయంలో టిడిపి హై కమాండ్ కూడా సానుకూలంగా ఉంది. కానీ ఇంతవరకు పదవి ఇవ్వకపోవడంతో అనేక రకాల చర్చ నడుస్తోంది. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆయనకు కీలక పదవి వరించబోతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో చక్రం తిప్పబోయే పదవిలో చంద్రబాబు కూర్చోబెడుతున్నట్లు సమాచారం.

తల్లితో టీడీపీలోకి ఎంట్రీ..
చిత్తూరు( Chittoor) జిల్లాలో అమర్ రాజా కంపెనీని ఏర్పాటు చేసి వేలాదిమందికి ఉపాధి కల్పించింది గల్లా కుటుంబం. ఆ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు జయదేవ్ తల్లి గల్లా అరుణ్ కుమారి. రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. మంత్రిగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2014 వరకు మంత్రి పదవిలో కొనసాగారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో గల్లా అరుణకుమారి తన కుమారుడు జయదేవ్తో కలిసి టిడిపిలో చేరారు. జయదేవ్ ఆ ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. గల్లా అరుణకుమారి చంద్రగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. గల్లా జయదేవ్ భారీ విజయాన్ని సొంతం చేసుకోగా.. అరుణ కుమారి మాత్రం చంద్రగిరిలో ఓడిపోయారు. అయితే జయదేవ్ 2019లో సైతం రెండోసారి గెలిచారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గల్లా కుటుంబం ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది. అమర్ రాజా కంపెనీ విస్తరణ అనేది ఏపీలో కాకుండా తెలంగాణకు మారిపోయింది. అదే సమయంలో ఎన్నికల కు ముందు గల్లా జయదేవ్ క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. కానీ పార్టీతో పాటు పార్టీ నాయకత్వం విషయంలో సానుకూలత ప్రదర్శిస్తూ వచ్చారు..

పోయిన కేంద్రమంత్రి ఛాన్స్..
అయితే ఏపీలో టీడీపీ గెలవడంతో గల్లా జయదేవ్ అనవసరంగా బయటకు వెళ్లిపోయారన్న టాక్ నడిచింది. కచ్చితంగా ఆయన టిడిపిలో కొనసాగి ఉంటే కచ్చితంగా మూడోసారి ఎంపీగా గెలిచేవారు. కేంద్ర మంత్రి పదవి సైతం పొందేవారు. ఒక విధంగా చెప్పాలంటే టిడిపి అధికారంలోకి రావడంతో జయదేవ్ కు ఒక పదవి దక్కుతుందని అంతా భావించారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఢిల్లీలో నియమిస్తారని టాక్ నడిచింది. తరువాత రాజ్యసభ పదవికి సైతం ఆయన పేరు వినిపించింది. అటు తర్వాత రాజ్యసభకు పంపిస్తారని, చంద్రబాబు సైతం మాట ఇచ్చేసారని వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఇటీవల గల్లా జయదేవ్ బయట పెద్దగా కనిపించడం లేదు. కానీ తెర వెనుక తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నారని తెలుస్తోంది. త్వరలో గల్లా జయదేవ్ కు పదవి ఖాయమని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో?

 

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular