HomeజాతీయంBJP strength increases: బిజెపి బలం పెరిగింది.. దేశంలో లెక్కలు మారాయి..

BJP strength increases: బిజెపి బలం పెరిగింది.. దేశంలో లెక్కలు మారాయి..

BJP strength increases: భారతదేశ రాజకీయ సమీకరణంలో ఎగువ సభ పాత్ర ఎప్పుడూ నిర్ణాయకమైంది. లోకసభలో స్పష్టమైన ఆధిక్యంతో వరుసగా మూడవసారి అధికారంలోకి వచ్చిన బీజేపీకి రాజ్యసభలో మాత్రం ఇంకా సౌకర్యవంతమైన మెజారిటీ లేదు. కారణం, ఎక్కువ మంది సభ్యులు ఉన్న రాష్ట్రాలు ప్రత్యర్థి పార్టీల ఆధీనంలో ఉండటమే. రాజ్యసభ మొత్తం సీట్ల పంపిణీ రాష్ట్రాల జనాభా ప్రకారం ఉంటుంది. ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడుల వంటి రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు కేటాయించబడ్డాయి. వీటిలో […]

BJP strength increases: భారతదేశ రాజకీయ సమీకరణంలో ఎగువ సభ పాత్ర ఎప్పుడూ నిర్ణాయకమైంది. లోకసభలో స్పష్టమైన ఆధిక్యంతో వరుసగా మూడవసారి అధికారంలోకి వచ్చిన బీజేపీకి రాజ్యసభలో మాత్రం ఇంకా సౌకర్యవంతమైన మెజారిటీ లేదు. కారణం, ఎక్కువ మంది సభ్యులు ఉన్న రాష్ట్రాలు ప్రత్యర్థి పార్టీల ఆధీనంలో ఉండటమే. రాజ్యసభ మొత్తం సీట్ల పంపిణీ రాష్ట్రాల జనాభా ప్రకారం ఉంటుంది. ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడుల వంటి రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు కేటాయించబడ్డాయి. వీటిలో ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ ప్రత్యక్షంగా లేదా కూటమిగా పరిమిత బలం కలిగి ఉండటం వల్ల పార్లమెంటు పై సభలో ప్రత్యక్ష ప్రభావం తగ్గింది.

మహారాష్ట్ర, బిహార్‌ గెలుపుతో..
గత ఏడాది మహారాష్ట్రలో, తాజాగా బిహార్‌లో జాతీయ జనతా దళం (జేడీయూ)తో సఖ్యత ద్వారా బీజేపీ తిరిగి అధికార భాజనమైందే కాక, ఎన్డీఏ కూటమి పాలన కొనసాగుతోంది. బిహార్‌లో 16 రాజ్యసభ స్థానాలు ఉండగా, ఈసారి కూటమి కలసి పోటీ చేస్తే అన్ని సీట్లు ఎన్డీఏ ఖాతాలో వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది బీజేపీకి ఎగువ సభలో బలం పెంచే కీలక అవకాశంగా నిలుస్తుంది. కూటమి రాష్ట్రాల్లో బీజేపీకి లభించే స్థానాలు మిత్ర పక్షాలతో పంచుకోవాల్సి వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేనలతో కూటమిగా ఉండటంతో అక్కడి సీట్లలో భాగస్వామ్యం తప్పదు. ఇదే పరిస్థితి బిహార్‌లోనూ ఉంది. ఈక్రమంలో సీట్ల సంఖ్య పెరిగినా, పార్టీకి నేరుగా లభించే వాటా పరిమితంగానే ఉంటుంది.

హరియాణా, ఒడిశాలో సొంతంగా..
రానున్న నెలల్లో హరియాణా, ఒడిశా రాష్ట్రాల్లో బీజేపీ స్వతంత్ర అధికారాన్ని బలోపేతం చేసింది. ఈ రాష్ట్రాల నుంచి వచ్చే సీట్లు బీజేపీ బలాన్ని రాజ్యసభలో మరింత పెంచబోతున్నాయి. రాజ్యసభలో సంఖ్యాబలం తక్కువగా ఉన్నా రాజకీయ చాతుర్యంతో బీజేపీ కీలక బిల్లులను ముందుకు తీసుకెళ్లగలిగింది. బిహార్‌ మార్పు, కొత్త రాష్ట్రాల్లో విస్తరణతో ఎగువ సభలో స్థిరబలం సాధించే వ్యూహం స్పష్టమవుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper