Amaravati capital legal status: అమరావతి( Amaravati capital ) ఏకైక రాజధానిగా గుర్తించేందుకు ఈనెల 28న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. మూడు రాజధానుల నిర్ణయంతో తలెత్తిన అయోమయాన్ని తెరదించుతూ అమరావతికి చట్టబద్ధత కల్పించడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. అమరావతిని ఏకైక రాజధానిగా ఆమోదిస్తూ కేంద్రానికి నివేదించనున్నారు. తద్వారా అమరావతికి చట్టబద్ధత దక్కనుంది. అందుకే ఈ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు.
పూర్తయిన ఉమ్మడి రాజధాని గడువు..
2014లో రాష్ట్ర విభజన జరిగింది. విభజన హామీల్లో భాగంగా హైదరాబాదును( Hyderabad) ఉమ్మడి రాజధానిగా నిర్ణయించారు కొన్నేళ్లపాటు. అయితే ఆ గడువు ముగియనుండడంతో సాంకేతికంగా ఇబ్బందులు రాకుండా ఉండేందుకు గాను.. అమరావతిని నోటిఫై చేస్తూ ముందుగా శాసనసభలో తీర్మానం చేస్తారు. అదే తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నారు. కేంద్రం అమరావతిని ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయం ప్రకటించనుంది. ఇకనుంచి అమరావతి రాజధానిని కదిలించలేని విధంగా మార్చేందుకు.. ఈనెల 28న శాసనసభ సమావేశం కీలకం కానుంది.
Also Read: జగన్ చేయరు.. చేస్తే ఓర్వలేరు.. ఆర్టీడీపై కొత్త ఏడుపు!
పెద్ద ఎత్తున నిధులు..
రాజధానిపై చట్టపరమైన స్పష్టత రానుండడంతో మౌలిక వసతుల కల్పన మరింతగా జరగనుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధానికి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చిన సంగతి తెలిసిందే. ప్రపంచ బ్యాంకుతోపాటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నిధులనుంచి 15 వేల కోట్లు కేటాయించింది. ఇప్పుడు చట్టబద్ధత కల్పించడం ద్వారా రాజ్యాంగబద్ధ నిధులన్నీ ఇకనుంచి అమరావతికి వర్తించనున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఇకమీదట అమరావతిని ఎవరూ టచ్ చేయలేనంతగా బలోపేతం చేయనున్నారు చట్టాన్ని. గతంలో మూడు రాజధానుల తో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అమరావతిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసింది. ఇకనుంచి ఆ పరిస్థితి ఉండదు కూడా.
