Homeఆంధ్రప్రదేశ్‌Punganur : మూడు రోజుల కిందట అదృశ్యం.. చివరకు సమ్మర్ స్టోరేజ్ లో డెడ్ బాడీ.....

Punganur : మూడు రోజుల కిందట అదృశ్యం.. చివరకు సమ్మర్ స్టోరేజ్ లో డెడ్ బాడీ.. ఏపీలో కలకలం రేపుతోన్న చిన్నారి మృతి మిస్టరీ

Punganur : పుంగనూరులో ఆరేళ్ల బాలిక అదృశ్యం విషాదాంతంగా మారింది.స్నేహితుల ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలికను గుట్టుచప్పుడు కాకుండా మాయం చేశారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు గత రెండు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు.అయితే ఆ బాలిక మిస్సింగ్ మిస్టరీ విషాదంగా మారింది. అసలు ఆ బాలికను ఎందుకు అదృశ్యం చేశారు? ఎందుకు చంపారు? అన్నది తెలియడం లేదు. కానీ ఆ చిన్నారి మృతదేహం అనుమానాస్పద స్థితిలో మాత్రం కనిపించింది. హత్యగా నిర్ధారణ అయింది. స్థానికంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. పుంగనూరులోని ఉబేదుల్లా కాంపౌండ్ కు చెందిన అజ్మతుల్లా కూతురు అస్వియా (6) తన స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చింది. సాయంత్రం 6 గంటల సమయంలో ఇలా ఆడుతుండగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.కాసేపటికి అస్వియా తల్లి బయటకు వచ్చి చూడగా చిన్నారి కనిపించలేదు. స్థానికులతో కలిసి వెతికినా ఆచూకీ కనిపించలేదు. తండ్రి ఆత్మతుల్లా రాత్రి 11 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మరుసటి రోజు ఉదయం ఎస్పీ ఆదేశాలకు 11 పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. రెండు స్క్వాడ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. అయినా సరే ఆచూకీ లభించలేదు. అజ్మతుల్లా ఫైనాన్స్ వ్యాపారం చేస్తుండడంతో.. ఎవరితోనైనా ఆర్థిక విభేదాలు ఉన్నాయోనని ఆరా తీశారు. కానీ ఎటువంటి ఫలితం లేకపోయింది.

* సమ్మర్ స్టోరేజీలో మృతదేహం
కాగా బుధవారం అస్వియా మిస్సింగ్ మిస్టరీ విషాదంగా మారింది. అదృశ్యమైన మూడు రోజుల తర్వాత పుంగనూరు సమ్మర్ స్టోరేజ్ దగ్గరచిన్నారి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు వెళ్లిన తల్లిదండ్రులు ఆ మృతదేహం అస్వియా దేనని గుర్తించారు. అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యం కావడంతో ఎవరో హత్య చేసి ఉంటారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. చిన్నారి హత్యకు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

* బయటపడని క్లూ
అయితే ఈ ఘటనకు సంబంధించి చిన్న క్లూ కూడా బయటకు రావడం లేదు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.నలుగురు వైద్యులు మృతదేహానికి పోస్టుమార్టం చేశారు.ఎస్పీ మణికంఠ సైతం ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. చిన్నారి శరీరంపై ఎటువంటి గాయాలు లేవన్నారు. ల్యాబ్ రిపోర్ట్ నిమిత్తం చిన్నారి అవయవాలను తిరుపతికి తరలించినట్లు పేర్కొన్నారు. పోస్టుమార్టం నివేదిక వెలువడిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు.దీంతో ఈ మిస్టరీ ఇంకా కొనసాగుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Football Legends Retirement

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...
US Iran Conflict

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...
FIFA World Cup Revenue

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...
Amitabh Bachchan

Amitabh Bachchan: ICU లో అమితాబ్ బచ్చన్.. అభిమానుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Amitabh Bachchan: 83 ఏళ్ళ వయస్సు లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ , నేటి తరం యంగ్ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్...
YSRCP Land Scam

YSRCP Land Scam: వందల కోట్ల 15.94 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలకు రాసి ఇచ్చేశాడు..

YSRCP Land Scam: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే బ్రహ్మాండంగా ముక్కలు పడతాయి.. ఈ సామెతను ఆ రెవెన్యూ అధికారి నిజం చేసి చూపించారు. తనకు ఆయాచితమైన చోటు...
Oktelugu Epaper