Civilizations
Civilizations: మనిషి సంఘజీవి. అనేక అనుబంధాలను కలిగియున్న జీవి.. అందుకే మానవ సమూహం అనేది ఈ ప్రపంచంలో ఉన్న జంతువులన్నింటికంటే గొప్పది. అని మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం కదా. కోతి నుంచి పుట్టిన మనిషి మానసిక పరిపక్వత చెందాడు. ఆది మానవుడి నుంచి మానవుడిగా రూపాంతరం చెందాడు. రూపాంతరం చెందిన తర్వాత దినదిన ప్రవర్తమానంగా ఎదిగాడు. అనేక నాగరిక సమాజాలను ఏర్పరచాడు. ఆ నాగరిక సమాజాలే ప్రస్తుతం మనం చూస్తున్న అధునాతన సమాజానికి బాటలు పరిచాయి. ఒకప్పుడు కాల గర్భంలో కలిసిపోయి.. తవ్వకాలలో మళ్లీ బయల్పడిన ఆ నగరాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
మొహంజోదారో, పాకిస్తాన్
పాకిస్తాన్ దేశంలోని సింధూ నది పరివాహక ప్రాంతంలో జరిపిన తవ్వకాలలో పురాతన సింధులోయ నాగరికత విలసిల్లినప్పుడు మొహంజోదారో అనే ఆధునిక పట్టణం బయటపడింది. గ్రిడ్ లాంటి లేఔట్, అధునాతన డ్రైనేజీ వ్యవస్థలను మొహంజోదారో నగరంలో పురాతన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అప్పట్లో హరప్పా సంస్కృతి కూడా వెలసిల్లింది. ఈ రెండు నగరాలు 1900 BCE లో కాలగర్భంలో కలిసిపోయాయి. అనేక యుద్ధాలు, ప్రకృతి విపత్తులు ఈ నగరాలు కాలగర్భంలో కలిసిపోవడానికి కారణమయ్యాయని పురాతన శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. సింధు నది పరివాహక ప్రాంతంలో జరిపిన తవ్వకాలలో ఈ మొహంజోదారో సంస్కృతి గురించి ప్రపంచానికి తెలిసింది.
టికెల్, గ్వాటెమాల
గ్వాటెమాల ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో బయటపడింది పురాతన మాయన్ నగరంలో భాగమైన టికాల్ ప్రాంతం. సుమారు 200 నుంచి 900 AD కాలంలో టికాల్ ప్రాంతం అతిపెద్ద మాయన్ నగరంగా విలసిల్లింది. అతి పెద్ద దేవాలయాలు, రాజభవనాలు ఈ కాలంలో విలసిల్లాయి. కాలక్రమంలో అవి కాలగర్భంలో కలిసిపోయాయి. ప్రస్తుతం టికాల్ ప్రాంతాన్ని యునెస్కో వారసత్వ సంపదగా ప్రకటించింది. అప్పట్లో జరిపిన తవ్వకాలలో టికాల్ ప్రాంతం బయటపడింది.
బాబి లోన్, ఇరాక్
పురాతన సామ్రాజ్యమైన మెసొపొటేమియా ప్రాంత రాజధానిగా బాబిలోనియా ఉండేది. యూఫ్రెట్స్ నది ఒడ్డున ఈ నగరం ఉండేది. ఇరాక్ రాజధాని బాగ్దాద్ కు దక్షిణంగా 85 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. పురాతన శాస్త్రవేత్తలు తవ్వకాలు జరపగా ఈ ప్రాంతం బయటపడింది.
ట్రాయ్, టర్కీ
హోమర్ పురాణ పద్యాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన నగరం ట్రాయ్. అప్పట్లో ఇది అత్యంత ఆకర్షణీయమైన నగరంగా పేరుపొందింది. టర్కీలోని హిసార్లిక్ ప్రాంతంలో ఈ నగరం ఉండేది. పురాతన శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాలలో ట్రాయ్ నగరం బయటపడింది. ఇందులో రాతి గోడలు, ఇతర అవశేషాలు బయటపడ్డాయి
పాంపీ, ఇటలీ
పాంపీ నగరం ఒకప్పుడు సంపన్న ప్రాంతంగా ఉండేది..24 నుంచి 79 AD వరకు ఈ ప్రాంతం అద్భుతంగా ఉండేది. వెసువియస్ పర్వతం విస్పోటనం చెందిన తర్వాత ఆ నగరం మొత్తం బూడిదమయంగా మారింది. అప్పటినుంచి అది కాల గర్భంలో కలిసిపోయింది. అనేక తవ్వకాల తర్వాత ఇది బయటపడింది. ఇది రోమన్ కాలం నాటి సాంస్కృతిని ప్రతిబింబిస్తుంది. పురాతన శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాలలో లభించిన కుడ్య చిత్రాలు నాటి సాంస్కృతిక జీవనానికి ప్రబల ఉదాహరణ..
పెట్రా, జోర్డాన్
పెట్రాను ఒకప్పుడు రోజ్ సిటీ అని పిలిచేవారట. నాబాటియన్ రాజ్యంలో పెట్రా వాణిజ్య కేంద్రంగా ఉండేది. అరేబియా, ఈజిప్ట్, మధ్యధరా సముద్రం మధ్య ఉంది.. క్రీస్తుశకం 363 లో సంభవించిన భూకంపంతో పెట్రా నగరంలో భారీ విధ్వాసానికి కారణమైంది. ఫలితంగా ఈ నగరం కాలగర్భంలో కలిసిపోయింది.
మచు పిచ్చు, పెరూ
పెరూ దేశం లోని అండీస్ పర్వతశ్రేణిలో మచుపిచ్చు అనే నగరం ఉండేది. అత్యంత పురాతన నగరం. అనేక ప్రకృతి రమణీయతల మధ్య ఈ నగరం ఉండేది. ఈ నగరంలో అనేక క్లిష్టమైన రాతి నిర్మాణాలు ఉన్నాయి. జూలై 24 , 1911 లో ఈ నగరం కాలగర్భంలో కలిసిపోయింది.. హిరామ్ బింగ్ హామ్ _111 అనే యేల్ విశ్వవిద్యాలయ చరిత్ర అధ్యాపకుడు మచు పిచ్చూ శిధిలాలను కనుగొన్నాడు. అతడు చెప్పడం ద్వారా ఈ నగరం విశిష్టత బయటి ప్రపంచానికి తెలిసింది..
లోథాల్, భారత్
లోథాల్ అనేది గుజరాతి పదాలైన లోత్, థాల్ నుంచి వచ్చిందని చరిత్రకారులు నమ్ముతారు.లోథాల్ అంటే శవాల దిబ్బ అని అర్థం.. సుమారు 3,700 BCE లో ఈ ప్రాంతంలో ప్రజలు నివసించేవారు. ఇది సింధు లోయ నాగరికతలో ఒక భాగం. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన కృత్రిమ ఓడరేవుకు ఈ ప్రాంతం నిలయంగా ఉంది. 1955 నుంచి 60 వరకు పురావస్తు శాఖ, సర్వే ఆఫ్ ఇండియా తవ్వకాలు జరుపగా.. అనేక చారిత్రక ఆధారాలు లభించాయి. ముఖ్యంగా అక్రో పోలిస్, దిగువ పట్టణం, బ్రెడ్ ఫ్యాక్టరీ, డ్రైనేజీ వ్యవస్థ.. వంటివి వెలుగు చూశాయి.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Special article on different civilizations
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com