Homeఅంతర్జాతీయంPakistan International Embarrassment: అంతర్జాతీయ వేదికలపై పరువు తీసుకుంటున్న పాకిస్తాన్‌!

Pakistan International Embarrassment: అంతర్జాతీయ వేదికలపై పరువు తీసుకుంటున్న పాకిస్తాన్‌!

Pakistan International Embarrassment: పాకిస్తాన్‌.. మన దాయాది దేశం.. మనతోపాటే స్వాతంత్య్రం పొందిన దేశం.. అపారమైన వనరులు, సంపద, విలువైన భూభాగం ఉన్న దేశం. కానీ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా సొంతంగా ఎదగలేని పరిస్థితి. ఇప్పటికీ అప్పు చేస్తేగాని రోజు గడవని దీనస్థితి. ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటూనే ఉగ్రవాదానికి మాత్రం భారీగా ఖర్చు చేస్తోంది. భారత్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా ప్రజల ప్రయోజనాలను ఫణంగా పెడుతోంది. ఇక ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌ అంతర్జాతీయ వేదికలపై మరింత […]

Pakistan International Embarrassment: పాకిస్తాన్‌.. మన దాయాది దేశం.. మనతోపాటే స్వాతంత్య్రం పొందిన దేశం.. అపారమైన వనరులు, సంపద, విలువైన భూభాగం ఉన్న దేశం. కానీ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా సొంతంగా ఎదగలేని పరిస్థితి. ఇప్పటికీ అప్పు చేస్తేగాని రోజు గడవని దీనస్థితి. ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటూనే ఉగ్రవాదానికి మాత్రం భారీగా ఖర్చు చేస్తోంది. భారత్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా ప్రజల ప్రయోజనాలను ఫణంగా పెడుతోంది. ఇక ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌ అంతర్జాతీయ వేదికలపై మరింత తీవ్ర అవమానాలకు గురవుతోంది. గాజా పీస్‌ బోర్డు సమావేశంలో ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌కు వ్యవహారాలు దేశ గౌరవాన్ని దెబ్బతీశాయి.

గాజా పీస్‌ బోర్డు సమావేశ నేపథ్యం..
వాషింగ్టన్‌లో జరిగిన ఈ సమావేశం హమాస్‌ అంతమే లక్ష్యంగా జరిగింది. గాజా శాంతి కోసం గాజీ ప్లాన్, అంతర్జాతీయ స్థిరీకరణ బలగాల ఏర్పాటుపై దృష్టి సారించింది. పాకిస్తాన్‌ పాల్గొనడం వివాదాస్పదం, ఎందుకంటే ఇజ్రాయెల్‌ పాక్‌ను గుర్తించకపోయినా సైనిక సహాయం ప్రతిపాదించడం సంక్లిష్టతను పెంచింది. షెహబాజ్‌ షరీఫ్‌ అమెరికా, ట్రంప్‌ను పొగిడేందుకే ఎక్కువ సమయం కేటాయించారు. ఆపరేషన్‌ సిందూర్‌ ఆపడానికి కృతజ్ఞత చెప్పగా, ట్రంప్‌ నుంచి బలవంత హగ్, వెనుక వరుసలో నిలబెట్టడం వంటివి జరిగాయి.

షెహబాజ్‌ షరీఫ్‌ వ్యవహారాలు..
షెహబాజ్‌ స్టాండప్, సిట్‌డౌన్‌లు చేస్తూ ట్రంప్‌ మాటలకు తల ఊపుతూ 25 కోట్ల పాక్‌ల ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టాడని విమర్శలు వచ్చాయి. ఆయన గ్రూఫ్‌ పొటోలో కూడా మూలల్లో ఉంచబడ్డాడు. ఆసిమ్‌ మునీర్‌ సైనికుల స్వంత లేఖలు పట్టించుకోకుండా ఇజ్రాయెల్‌ మద్దతుతో సైన్యం పంపాలని నిర్ణయించడం దేశీయ అసంతృప్తిని పెంచింది. ఇటువంటి చర్యలు ఆర్థిక సాయం కోసం దౌత్య మర్యాదలను మరచిపోయినట్టు కనిపిస్తున్నాయి.

దౌత్య ప్రకటనల్లో తప్పులు
ఇక దౌత్యవేత్తల స్టేట్‌మెంట్‌లో ’యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా’ను తప్పుగా రాయడం, ఇజ్రాయెల్‌–ఇరాన్‌ దాడిని ఖండించే ప్రకటనలో ’ఐ కండోమ్‌’ లాంటి విడ్డూర వ్యాఖ్యలు పాక్‌ విశ్వసనీయతను మరింత దెబ్బతీశాయి. ఇటీవల ఐక్యరాస్య సమితి వేదికపై భారత్‌ నుంచి ’దుర్వినియోగం’ ఆరోపణలు, పుతిన్‌తో 40 నిమిషాల వేయిట్‌ వంటి ఘటనలు పాక్‌కు అవమానాల తీరుగా మారాయి. చిన్న ఆఫ్రికా దేశాలు కూడా ఇంత తక్కువ చేయబడవని విమర్శకులు చెబుతున్నారు.

భారత్‌ అబ్జర్వర్‌ స్థాయిలో ఒక అధికారిని పంపి పరిణామాలను మాత్రమే గమనిస్తోంది. పాక్‌ మాత్రం ఆర్థిక ఒత్తిడికి తప్పుకోవడానికి దౌత్య స్వార్థాలను రాజీ చేసుకుంటోంది. ఇది దేశీయ రాజకీయాల్లో విభేదాలు, అంతర్జాతీయంగా ఒంటరితనాన్ని పెంచుతుంది. మునీర్, షెహబాజ్‌లు సిగ్గు వదలకపోతే పాక్‌ గౌరవం మరింత పోగొట్టుకుంటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper