Israel Mossad: పాలస్తీనా – ఇజ్రాయిల్ యుద్ధంలోకి హెజ్ బొల్లా అనే మిలిటెంట్ సంస్థ అనవసరంగా ప్రవేశించింది. ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ పై దాడులు చేసింది. ఇజ్రాయిల్ సైనిక వ్యవస్థపై రాకెట్లు ప్రయోగించింది. ఇరాన్, ఇతర దేశాలతో కలిసి ఇజ్రాయిల్ కు చుక్కలు చూపించాలని ప్రయత్నించింది. ఇందులో కొంతమేర విజయవంతమైంది. దీంతో ఇజ్రాయిల్ దేశానికి ఒక్కసారిగా షాక్ తగిలింది.. దీంతో ఆదేశం అంతర్మదనంలో పడింది. ఆ తర్వాత తన బుర్రకు పని చెప్పింది. తనను ఇబ్బంది పెట్టిన హెజ్ బొల్లా మిలిటెంట్ సంస్థ పని పట్టింది. ఏం జరిగిందో తెలుసుకునే లోగానే చేయాల్సిన నష్టం చేసి వెళ్లిపోయింది. అంతర్జాతీయ సైనిక నిపుణులు కూడా ఇజ్రాయిల్ చేసిన దాడిని సరికొత్తగా అభివర్ణిస్తున్నారు. ఈ తాడి వెనక ఇజ్రాయిల్ మెగా సంస్థ మొస్సాద్ ఉండి ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. హెజ్ బొల్లా మిలటెంట్ సంస్థలో పనిచేస్తున్న వ్యక్తులను చంపడానికి వేలాది పేజర్లను ఇజ్రాయిల్ ఉపయోగించింది . అందులో మిలిటరీ గ్రేడ్ పేలుడు పదార్థాలను అమర్చింది. తైవాన్ దేశంలో తయారైన పరికరాలను ఇజ్రాయిల్ దీనికోసం ఉపయోగించింది.
ఫోన్లను ట్రాక్ చేసింది
ఇజ్రాయిల్ నిఘా బృందం కొంతకాలంగా హెజ్ బొల్లా మిలటెంట్ గ్రూపుకు చెందిన నంబర్ – 2 కమాండర్ ఫాద్ షుక్ర్ ను మట్టు పెట్టడానికి ప్రణాళిక రూపొందించింది. దానికంటే ముందు అతడికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ అతడు ఎత్తగానే ఇజ్రాయిల్ టార్గెట్లోకి వెళ్లిపోయాడు. అయితే ఈ ముప్పును హెజ్ బొల్లా చీప్ హాసన్ నశ్రుల్లా ఫోన్లపై నిషేధం విధించాడు. దీంతో పేజర్ల వినియోగం ఇజ్రాయిల్, హెజ్ బొల్లా మధ్య సర్వసాధారణంగా మారింది. ఈ పేజర్లలో ఇజ్రాయిల్ అత్యంత శక్తివంతమైన పెంటా ఎరిత్రటాల్ ప్లాస్టిక్ పేలుడు పదార్థాన్ని వాడింది. ఈ పదార్థాన్ని సైనిక దళాలు, భవనాలకు కూల్చివేత సమయంలో వాడుతుంటారు. వాహనాలలోని బ్యాటరీ ఉష్ణోగ్రతను పెంచి కూడా పేజర్ల మాదిరిగా పేల్చవచ్చు. హెజ్ బొల్లా మిలిటెంట్లపై పేజర్లు పేలినప్పుడు ముందుగా భీప్ అనే శబ్దం వచ్చిందట. అయితే ఆ దాడి నుంచి హెజ్ బొల్లా చీఫ్ బయటపడ్డాడు. అయితే ఈ దాడిలో హెజ్ బొల్లా సంస్థకు చెందిన ఇద్దరు ఎంపీల కుమారులు.. మరో ఏడుగురు చనిపోయారు. మొత్తం 3,000 మంది గాయపడ్డారు. ఈ దాడిలో ఇరాన్ దౌత్య వేత్త కూడా గాయపడ్డాడు. తమకు వ్యతిరేకంగా హిజ్ బొల్లా కుట్ర పన్నిన విషయం ఇజ్రాయిల్ కు తెలిసిపోయింది.. అందువల్లే ఈ దాడులకు పాల్పడినట్టు తెలుస్తోంది.. అయితే ఈ దాడుల వల్ల హిజ్ బొల్లా ఇప్పట్లో కోలుకోకపోవచ్చని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. ఇజ్రాయిల్ సాంకేతిక ముందు పెద్ద పెద్ద దేశాలే తలవంచుతాయని.. అలాంటిది హిజ్ బొల్లా ఎలా నిలుస్తుందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read More